Pawan Kalyan: పవర్స్టార్ పవన్ కల్యాణ్ హరోగా సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతోన్నచిత్రం భీమ్లానాయక్. ఇందులో రానా దగ్గుబాటి కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా, మలయాళంలో సూపర్హిట్గా నిలిచిన అయ్యప్పనుమ్ కోశియుమ్ సినిమాకు రీమేక్గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. అయితే, ఈ సినిమా తర్వాత ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడితో కలిసి ఓ సినిమా చేయనున్నారు పవన్. అదే హరిహర వీరమల్లు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తి చేసుకుంది.
మరోవైపు ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న భీమ్లానాయక్.. ప్రస్తుతం ప్రమోషన్స్ పనుల్లో బిజీగా ఉంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్లు సినిమాపై భారీగా అంచనాలు రేకెత్తించాయి. సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా… రానా సరసన సంయుక్త మీనన్ నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయనుంది చిత్రబృందం.