Pawan Kalyan: ‘హరిహర వీరమల్లు’ సినిమా నుంచి నిధి తప్పుకుందా?

Pawan Kalyan: పవర్​స్టార్​ పవన్​ కల్యాణ్ హరోగా సాగర్​ కె. చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతోన్నచిత్రం భీమ్లానాయక్​. ఇందులో రానా దగ్గుబాటి కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా, మలయాళంలో సూపర్​హిట్​గా నిలిచిన అయ్యప్పనుమ్​ కోశియుమ్​ సినిమాకు రీమేక్​గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. థమన్​ స్వరాలు సమకూరుస్తున్నారు. అయితే, ఈ సినిమా తర్వాత ప్రముఖ దర్శకుడు క్రిష్​ జాగర్లమూడితో కలిసి ఓ సినిమా చేయనున్నారు పవన్​. అదే హరిహర వీరమల్లు. పాన్​ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్​ […]

Written By: Raghava Rao Gara, Updated On : December 5, 2021 10:23 am
Follow us on

Pawan Kalyan: పవర్​స్టార్​ పవన్​ కల్యాణ్ హరోగా సాగర్​ కె. చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతోన్నచిత్రం భీమ్లానాయక్​. ఇందులో రానా దగ్గుబాటి కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా, మలయాళంలో సూపర్​హిట్​గా నిలిచిన అయ్యప్పనుమ్​ కోశియుమ్​ సినిమాకు రీమేక్​గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. థమన్​ స్వరాలు సమకూరుస్తున్నారు. అయితే, ఈ సినిమా తర్వాత ప్రముఖ దర్శకుడు క్రిష్​ జాగర్లమూడితో కలిసి ఓ సినిమా చేయనున్నారు పవన్​. అదే హరిహర వీరమల్లు. పాన్​ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్​ ఇప్పటికే సగానికి పైగా పూర్తి చేసుకుంది.

మధ్యలో కరోనా కారణంగా ఆగిపోయింది.  కాగా, తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్​ న్యూస్​ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్​గా నిధి అగర్వాల్​ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ హీరోయిన్​ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో నిజమెంత అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

మరోవైపు ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న భీమ్లానాయక్​.. ప్రస్తుతం ప్రమోషన్స్​ పనుల్లో బిజీగా ఉంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్​లు సినిమాపై భారీగా అంచనాలు రేకెత్తించాయి. సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా… రానా సరసన సంయుక్త మీనన్  నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయనుంది చిత్రబృందం.