Homeఎంటర్టైన్మెంట్Superstar Krishna- Chiranjeevi: అప్పు తీర్చడానికి సూపర్ స్టార్ కృష్ణకు స్థలం అమ్మిన చిరంజీవి..

Superstar Krishna- Chiranjeevi: అప్పు తీర్చడానికి సూపర్ స్టార్ కృష్ణకు స్థలం అమ్మిన చిరంజీవి..

Superstar Krishna- Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో కలిసొస్తే సంపాదన కోట్లలో ఉంటుంది. స్టార్లుగా మారితే రాజభోగం అనుభవించొచ్చు. కానీ ఒక్కోసారి సిరి సంపదలు వచ్చినట్లే వచ్చి.. మాయమైపోతూ ఉంటాయి. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కొందరు స్టార్ హీరోలు ఆస్తులు బాగానే సంపాదించినా వాటిలో కొన్నింటిని పలు కారణాలతో అమ్మేశారు. ఇలాంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. మూడు దశాబ్దాల హీరో చిరంజీవికి తెలుగు పరిశ్రమ చెన్నైలో ఉండగానే ఆస్తులు కూడబెట్టారు. అందులో ఒకదానిని సూపర్ స్టార్ కృష్ణ కు అమ్మేశాడట. ఇటీవల ప్రముఖ నిర్మాత ఎన్ వీ ప్రసాద్ ‘గాడ్ పాదర్’ ప్రమోషన్ సందర్భంగా ఆ విషయాన్ని చెప్పారు. ఆ వివరాలు చూద్దాం.

Superstar Krishna- Chiranjeevi
Superstar Krishna- Chiranjeevi

చిత్ర పరిశ్రమలన్నీ చెన్నైలోనే ఉండడంతో స్టూడియోలు కూడా అక్కడే ఉండేవి. ఆ కాలంలోనే సినిమా స్టార్లుగా మారిన కృష్ణ, చిరంజీవిలు కొన్ని ఆస్తులను కూడబెట్టారు. ఆ తరువాత చిత్ర పరిశ్రమ హైదరాబాద్ కు వచ్చినా.. వీరి ఆస్తులు అక్కడే ఉండిపోయాయి. సూపర్ స్టార్ కృష్ణకు చెన్నైలోని ఆరుణాచలం గార్డెన్ పక్కన 5 ఎకరాల స్థలం ఉండేది. దీనికి కృష్ణా గార్డెన్స్ అని పేరు పెట్టారు. ఇందులో ‘ఈనాడు’సినిమా మొదటిసారిగా షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమాలో మురికివాడ సెట్స్ ను ఇందులో వేశారు. ఆ తరువాత కొన్ని సినిమాలను కూడా ఇందులో చిత్రీకరించారు.

ఈ ఐదెకరాల్లో చిరంజీవికి ఒక ఎకరం అంతకుముందే కొనుగోలు చేశారు. అయితే చిరంజీవి సినిమాలు మానేసి ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు. ఆ తరువాత కొన్ని కారణాల వల్ల ఆ పార్టీని కాంగ్రెస్ లో వీలీనం చేసిన విషయం తెలిసిందే. ఈ సమయంలో చిరంజీవికి భారీగా అప్పులయ్యాయి. వాటిని తీర్చడానికి రూ.25 కోట్ల అవసరం ఏర్పడింది. ఈ క్రమంలో ఆయనకు చెన్నైలో ఉన్న ఎకరం స్థలాన్ని కృష్ణకు అమ్మేశారు. దీంతో వచ్చిన డబ్బుతో అప్పులు తీర్చారు.

Superstar Krishna- Chiranjeevi
Superstar Krishna- Chiranjeevi

చిరంజీవిపై కొన్ని రోజులగా అనేక రూమర్స్ వచ్చాయి. ప్రజారాజ్యం పార్టీపై కొందరు రకరకాల వార్తలు పెట్టారు. ‘గాడ్ పాదర్’ మూవీ ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ నిర్మాత ఎన్ వి ప్రసాద్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. చిరంజీవి ఎకరం స్థలం అమ్మి ప్రజారాజ్యం అప్పులు తీర్చారన్నారు. ఈ నేపథ్యంలో ఆ విషయం బయటకు వచ్చింది. అయితే ప్రస్తుతం కృష్ణా గార్డెన్ ను డెవలప్ మెంట్ కు ఇచ్చారు. అందులో పెద్ద అపార్ట్మెంట్ నిర్మించారు.

SHAIK SADIQ
SHAIK SADIQhttps://oktelugu.com/
SHAIK SADIQ is a senior content writer who writes articles on AP Politics, General. He has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Politics. He Contributes Politics and General News. He has more than 10 years experience in Journalism.

Related News

Most Popular

Delhi Protests

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...
Team India Bowling

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...
OG 2 Animation Video

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...
KCR And Revanth Reddy

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Oktelugu Epaper