Chiranjeevi: గత 50 సంవత్సరాలుగా మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందించాడు. డిఫరెంట్ సినిమాలతో గొప్ప విజయాలను సాధించాడు. 70 సంవత్సరాల పైబడిన వయసులో కూడా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు దూసుకెళ్తుండటం విశేషం…ఇక తన కొడుకు అయిన రామ్ చరణ్ ను ఇండస్ట్రీకి పరిచయం చేయడమే కాకుండా తనదైన రీతిలో సత్తా చాటుకునే విధంగా ప్రణాళికలు రూపొందించాడు. అందుకే రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియాలో స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు. ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకుంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా రాని గుర్తింపు ఆయన చేసిన సినిమాలతో తెచ్చుకున్నాడు. అది చిరంజీవి నట వారసుడిగా రామ్ చరణ్ ఇండస్ట్రీ కి వచ్చాడు. ఎలాగైనా సరే తను ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా మారాలనే ప్రయత్నంలో చిరంజీవి తన కొడుకుకి సలహాలు సూచనలను ఇస్తు స్టోరీస్ సెలక్షన్స్ లో కూడా హెల్ప్ చేస్తూ వచ్చాడు.
ఇక ఇలాంటి క్రమంలోనే చిరంజీవి మొత్తానికైతే ‘చిరుత’ సినిమా తర్వాత ‘మగధీర’ సినిమాతోనే రామ్ చరణ్ టాప్ హీరోగా వెలుగొందుతూ ముందుకు దూసుకెళ్లాడు. మొదటి రెండు సినిమాలతోనే హీరో ప్రేక్షకుల్లోకి వెళ్లిపోయివాలి. లేకపోతే మాత్రం ఆడియన్స్ హీరోలను యాక్సెప్ట్ చేయరనే ఒక నమ్మకంతోనే చిరంజీవి రామ్ చరణ్ ను చాలా ఎఫెక్టివ్ గా ప్రేక్షకుల్లో పంపించి హీరోగా తనని నిలబెట్టడం లో సక్సెస్ అయ్యాడు. కానీ ఈ విషయంలో నాగార్జున మాత్రం చాలా వరకు వెనకపోయాడనే చెప్పాలి. తన కొడుకుల విషయంలో ఆయన సరిగ్గా ఆలోచించలేదు.
ఎంత సేపు సక్సెస్ రావాలనే ప్రయత్నం చేశాడు. కానీ అది వర్కౌట్ కాలేదు. చిరంజీవి మాత్రం రామ్ చరణ్ విషయంలో మార్కెట్ ను పెంచే ప్రయత్నం చేశాడు. దానివల్ల సక్సెస్ రాకపోయిన కూడా హీరోకి ఒక మార్కెట్ అనేది బిల్డ్ అవుతుంది. కానీ నాగచైతన్య అఖిల్ విషయంలో నాగార్జున అలా చేయలేకపోయాడు. అందువల్లే వాళ్ళు ఈరోజు స్టార్ హీరోలుగా మారలేకపోయారని ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…
