మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న సంగతి తెల్సిందే. ఈ మూవీకి ‘ఆచార్య’ అనే టైటిల్ ఖరారైంది. ఈమూవీలో చిరంజీవి డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. మెగాస్టార్ కు జోడీగా తొలుత త్రిషను ఖరారు చేశారు. తాజాగా త్రిష ఈ మూవీని తప్పుకున్నట్లు ప్రకటించింది. దీంతో చిరు పక్కనే నటించే భామ ఎవరనే ఆసక్తి మొదలైంది. చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ‘ఖైదీ-150’లో చిరుకు జోడీగా నటించిన కాజల్ అగర్వాల్ నే ఈ మూవీలో తీసుకున్నట్లు తెలుస్తోంది. చిరుతో మరోసారి ఆడిపాడిందుకునే చందమామ రెడీ అయినట్లు సమాచారం.
‘ఆచార్య’లో ఓ కీలక పాత్రలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించనున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ మూవీలో షూటింగ్లో రాంచరణ్ బీజీగా ఉండటంతో చరణ్ పాత్రలో మహేష్ నటిస్తాడనే ప్రచారం జరిగింది. అయితే చివరకు రాంచరణ్ నటించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. రాంచరణ్ పాత్ర ఈ మూవీలో కీలకంగా ఉండనుంది. దాదాపు 30నిమిషాలపాటు రాంచరణ్ పాత్ర ఈ మూవీలో ఉండనుందట. ఇక రాంచరణ్ జోడీగా బాలీవుడ్ భామను తీసుకున్నట్లు తెలుస్తోంది.
రాంచరణ్ కు జోడీగా కియారా అడ్వాణీ ఎంపికైనట్లు సమాచారం. కియారా అడ్వాణీ గతంలో రాంచరణ్ సరసన ‘వినయవిధేయరామ’ మూవీలో నటించింది. ఈ మూవీలో చెర్రీకి జోడీగా మెప్పించింది. తాజాగా ‘ఆచార్య’ మూవీలో కియారా అడ్వాణీ చరణ్ పక్కన ఆడిపాడేందుకు సిద్ధమవుతుంది. చిరు-152వ మూవీని రాంచరణ్-మ్యాట్నీ ఎంటటైన్మెంట్ తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. చాలాకాలం తర్వాత చిరు మూవీకి మణిశర్మ అదిరిపోయే సంగీతాన్ని అందిస్తున్నాడు.