ఎన్టీఆర్ తో నటించడం నా అదృష్టం: మెగాస్టార్

ఎన్టీఆర్ 98వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, అభిమానులు ఘన నివాళులు అర్పించారు. గురువారం ఉదయమే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ నాయకులు, అభిమానులు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకొని నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణ కుటుంబ సమేతంగా ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకొని ఘనంగా నివాళులర్పించారు. ఎన్టీఆర్ కూతురు పురంధరేశ్వరీ, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతీ, పలువురు టీడీపీ నాయకులు, అభిమానులు పెద్దఎత్తున చేరుకొని ఆయనకు […]

Written By: Neelambaram, Updated On : May 28, 2020 1:08 pm
Follow us on


ఎన్టీఆర్ 98వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, అభిమానులు ఘన నివాళులు అర్పించారు. గురువారం ఉదయమే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ నాయకులు, అభిమానులు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకొని నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణ కుటుంబ సమేతంగా ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకొని ఘనంగా నివాళులర్పించారు. ఎన్టీఆర్ కూతురు పురంధరేశ్వరీ, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతీ, పలువురు టీడీపీ నాయకులు, అభిమానులు పెద్దఎత్తున చేరుకొని ఆయనకు నివాళులు అర్పించి ఆయనతో తమకున్న అనుబంధాన్ని తలుచుకున్నారు. ఎన్టీఆర్ సేవలను గుర్తుచేసుకున్నారు.

ఎన్టీఆర్ కు నివాళులు అర్పిస్తూ ప్రముఖుల ట్వీట్స్..
ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని మెగాస్టార్ చిరంజీవి ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ట్వీట్ చేశారు. ‘తెలుగు జాతి పౌరుషం, తెలుగువారి ఆత్మగౌరవం, తెలుగు నేల గుండెల్లో ఎన్నటికీ చెదరని జ్ఞాపకం, నందమూరి తారక రామారావుగారి కీర్తి అజరామరం.. వారితో కలిసి నటించడం నా అదృష్టం. పుట్టినరోజునాడు ఆ మహానుభావుని స్మరించుకుంటూ..’ అని ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ తో కలిసి దిగిన ఫొటోను మెగాస్టార్ షేర్ చేశారు. కాగా ఎన్టీఆర్, చిరంజీవి కలిసి ‘తిరుగు లేని మనిషి’ మూవీలో నటించారు.

అదేవిధంగా ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ తాతయ్య జయంతి సందర్భంగా భావోద్వేగానికి లోనయ్యాడు. ‘మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది, మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది, పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాత.. సదా మీ ప్రేమకు బానిసను.. మీరు లేని లోటు తీర్చనిది..’ అంటూ ఎన్టీయార్ ఫొటోను షేర్ చేసి తన ఫీలింగ్స్ ను అభిమానులతో పంచుకున్నాడు. వీరితోపాటు పలువురు సెలబెట్రీలు ఎన్టీఆర్ ను గుర్తుచేసుకుంటూ ట్వీట్ చేస్తున్నారు.