వేసవిలోనే “చావు కబురు చల్లగా”

టాలీవుడ్ లో కొత్త చిత్రాల విడుదల తేదీల ప్రకటనల పరంపర కొనసాగుతూనే ఉంటుంది. సమ్మర్ పోటీలోకి తాజాగా మరో సినిమా వస్తున్నట్లు ప్రకటించింది. వేసవి వేడిలో ప్రేక్షకుల తాపాన్ని తగ్గించేందుకు సినిమాలు దూసుకొస్తున్నాయి. యువ హీరో కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా ‘చావు కబురు చల్లగా’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీతో కౌశిక్‌ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లలకు మంచి ఆదరణ లభించింది. కార్తికేయ మార్చురీ […]

Written By: Neelambaram, Updated On : February 1, 2021 11:03 am
Follow us on


టాలీవుడ్ లో కొత్త చిత్రాల విడుదల తేదీల ప్రకటనల పరంపర కొనసాగుతూనే ఉంటుంది. సమ్మర్ పోటీలోకి తాజాగా మరో సినిమా వస్తున్నట్లు ప్రకటించింది. వేసవి వేడిలో ప్రేక్షకుల తాపాన్ని తగ్గించేందుకు సినిమాలు దూసుకొస్తున్నాయి. యువ హీరో కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా ‘చావు కబురు చల్లగా’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీతో కౌశిక్‌ దర్శకుడిగా పరిచయం కానున్నాడు.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లలకు మంచి ఆదరణ లభించింది. కార్తికేయ మార్చురీ వ్యాన్‌ నడిపే డ్రైవర్‌గా, హాస్పిటల్ లో నర్సుగా లావణ్య చేసే సందడి సినిమా ఎంత వినోదాత్మకంగా ఉంటుందో చెప్పేస్తుంది. హీరో హీరోయిన్ల ఘాటైన పెదవి చుంబనం ఈ సినిమా మీద అంచనాలని పెంచేసింది. తాజాగా మర్చి 19వ తేదీన ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్లు పేర్కొంటూ కార్తికేయ కొత్త పోస్టర్ ని రిలీజ్ చేశారు.

కార్తికేయ ట్విట్టర్ లో ” ఈ మార్చ్ 19 కి… బాలరాజు గాడు, మల్లికా కలిసి చావు కబురు చల్లగా చెప్పడానికి థియేటర్స్ లోకి వస్తున్నారు. గీత ఆర్ట్స్ బ్యానర్, సూపర్ టాలెంటెడ్ డైరెక్టర్ కౌశిక్, బ్యూటిఫుల్ రాక్షసి లావణ్య త్రిపాఠితో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని మెగా ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు.