దేశంలోకి ప్రవేశించిన కరోనా మహమ్మరిని తరిమికొట్టేందుకు కేంద్రం లాక్డౌన్ చేపట్టింది. దీంతో వ్యాపార, వాణిజ్య, తదితర సంస్థలను మూతపడ్డాయి. కరోనా ఎఫెక్ట్ తో సినిమా షూటింగ్ లన్నీ వాయిదాపడ్డాయి. థియేటర్ల మూతపడ్డాయి. దీంతో పలువురు సినీ స్టార్లు సోషల్ మీడియాలో కరోనా నివారణకు తమవంతు బాధ్యతగా అవగాహన కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు టాలీవుడ్ స్టార్లు కరోనాపై సోషల్ మీడియాలో వీడియో సాంగ్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట వైరల్ అవుతోంది.
‘వి గోనా ఫైట్ విత్ కరోనా’ అంటూ సాగే పాటను సంగీతాన్ని కోటి అందించాడు. కోటినే ఈ పాటకు ట్యూన్ అందించి అలపించాడు. ఈ వీడియో సాంగ్లో మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సుప్రీమ్ హీరో సాయితేజ్ నటించారు. కరోనాపై అవగాహన కల్పించేలా పలు జాగ్రత్తలను సూచించారు.
సంగీత దర్శకుడు కోటి పాటకు మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వరుణ్ తేజ్, సాయితేజ్ వాళ్ల ఇళ్లలోనే ఉంటూ వీడియోను కవర్ చేయడం విశేషం. వీరందరి విజువల్స్ ను ఆకర్షణీయంగా ఎడిట్ చేసి పాటగా విడుదల చేశారు. దీంతో ఈ కరోనా పాట వైరల్ అవుతోంది. వీడియో రూపంలో కరోనాపై జాగ్రత్తలు సూచించడంపై వీరిందరిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.