Mohan babu: మోహన్ బాబు పై కేసు నమోదు…

Mohan babu: గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో… సీనియర్ నటుడు, మాజీ పార్లమెంటు రాజ్యసభ సభ్యులు డా.ఎం.మోహన్ బాబు పై కేసు నమోదు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల సందర్భంగా ”మా ఎన్నికల్లో ఘర్షణ ఏమిటి… ఏమిటీ గొడవలు… ఏమిటి బీభత్సం… నో ఎడ్యుకేటెడ్ పర్సన్స్ , ఎవ్రీబడీ ఈజ్ అబ్జర్వింగ్… గొర్రెలు మేపుకునేవాడి దగ్గర కూడా సెల్ ఫోనుంది అంటూ మాట్లాడరు. […]

Written By: Raghava Rao Gara, Updated On : October 19, 2021 6:27 pm
Follow us on

Mohan babu: గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో… సీనియర్ నటుడు, మాజీ పార్లమెంటు రాజ్యసభ సభ్యులు డా.ఎం.మోహన్ బాబు పై కేసు నమోదు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల సందర్భంగా ”మా ఎన్నికల్లో ఘర్షణ ఏమిటి… ఏమిటీ గొడవలు… ఏమిటి బీభత్సం… నో ఎడ్యుకేటెడ్ పర్సన్స్ , ఎవ్రీబడీ ఈజ్ అబ్జర్వింగ్… గొర్రెలు మేపుకునేవాడి దగ్గర కూడా సెల్ ఫోనుంది అంటూ మాట్లాడరు. ఈ తరుణంలో వారి వృత్తిని కించపరిచేలా మాట్లాడారని బాధితులు పేర్కొన్నారు.

గొర్రెలు కాసుకునే వాళ్ళు చూస్తుంటే సినీతారల గౌరవం పోతుందన్నట్టు అర్థం వచ్చేలా గొర్లకాపరులను కించపరిచేలా రాజ్యసభ సభ్యులు డా.ఎం.మోహన్ బాబు వ్యాఖ్యలు చేయడం సరైంది కాదు అని అన్నారు.   కావున గొర్రెలకాపరులు కించపర్చేలా మాట్లాడిన  డా.ఎం.మోహన్ బాబు పై చట్టపరమైన చర్యలు తీసుకొని గొర్రెల కాపరుల ఆత్మగౌరవాన్ని కాపాడాలని వారు కోరుతున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు పోలీస్ స్టేషన్ లో గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మాజీ పార్లమెంటు రాజ్యసభ సభ్యులు డా.ఎం.మోహన్ బాబు పై  ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సంఘం జిల్లా అధ్యక్షులు కలికినేని తీరీష్, సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బసినబోయిన గంగరాజు, రాము, లాలయ్య తదితరులు పాల్గొన్నారు.