‘బన్నీ’.. సుకుమార్ ని కంట్రోల్ పెట్టు !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మొదటిసారి పాన్ ఇండియా లెవల్లో పుష్ప సినిమా చేద్దామని ప్లాన్ చేసుకొని షూటింగ్ మొదలుపెట్టాలనుకునే లోపు ఎంట్రీ ఇచ్చింది కరోనా. దాంతో బన్నీ పాన్ ఇండియా కలలు మరో ఏడాది దాకా నెరవేరేలా కనబడటం లేదు. కానీ క్రియేటివ్ డైరెక్టర్ గా ముద్ర సంపాధించిన సుకుమార్ మాత్రం ఈ సినిమా పై రోజుకొక రకంగా మార్పులు చేర్పులు అంటూ హడావుడిగా ఉన్నాడు. దీనికి తోడు తన రైటర్ టీమ్ తో స్క్రిప్ట్ […]

Written By: admin, Updated On : July 16, 2020 6:28 pm
Follow us on


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మొదటిసారి పాన్ ఇండియా లెవల్లో పుష్ప సినిమా చేద్దామని ప్లాన్ చేసుకొని షూటింగ్ మొదలుపెట్టాలనుకునే లోపు ఎంట్రీ ఇచ్చింది కరోనా. దాంతో బన్నీ పాన్ ఇండియా కలలు మరో ఏడాది దాకా నెరవేరేలా కనబడటం లేదు. కానీ క్రియేటివ్ డైరెక్టర్ గా ముద్ర సంపాధించిన సుకుమార్ మాత్రం ఈ సినిమా పై రోజుకొక రకంగా మార్పులు చేర్పులు అంటూ హడావుడిగా ఉన్నాడు. దీనికి తోడు తన రైటర్ టీమ్ తో స్క్రిప్ట్ ను పోస్ట్ మార్టం చేస్తున్నాడు. అసలుకే సంవత్సరాలు తరబడి కథలు రాసే సుకుమార్, మళ్ళీ కథలో మార్పులు చేస్తూ పోతే అనవసరమైన విషయం ఎక్కువై, సినిమాలో మెయిన్ కంటెంట్ దెబ్బ తినే ప్రమాదం లేకపోలేదు. సుకుమార్ మహేష్ తో చేసిన నేనొక్కడినే అదే బాపతు సినిమా. ఇప్పుడు పుష్పకి అదే గతి పడితే ఎలా.. ఎందుకైనా మంచింది బన్నీ , సుకుమార్ ని స్క్రిప్ట్ విషయంలో కంట్రోల్ పెట్టడం మంచింది.

చిరు చెల్లి పై రూమర్స్.. ఫైనల్ చేయలేదు !

ఇక అక్టోబర్ సెకెండ్ వీక్ నుండి ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ అధిక భాగం అడవులలో చిత్రీకరించాల్సి రావటం, అలాగే సినిమాలో యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కువుగా ఉండటం, షూటింగ్ కి ఎక్కువమంది సిబ్బంది అవసరం కావడంతో ఏమి చేయాలా అని యూనిట్ తర్జనభర్జన పడుతోంది. పైగా అటవి ప్రాంతంలో షూట్ చేయాలి. అందుకే మొదట బన్నీ – రష్మిక పై సాంగ్స్ ను షూట్ చేయాలని చూస్తున్నారు. అయితే ఫస్ట్ షెడ్యూల్ లో మాత్రం ఈ సినిమాలోని ఓ స్పెషల్‌ సాంగ్‌ ను షూట్ చేస్తారు.

అన్నట్టు ఈ ఐటమ్ పాట కోసం బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌటెలాను తీసుకున్నారు. ఇక ఎలాగూ తమిళ హీరో విజయ్‌ సేతుపతి ఈ సినిమాలో పోలీస్‌ ఆఫీసర్‌ గా నటించడానికి మొదట ఒప్పుకుని, ఆ తరువాత కరోనాతో డేట్స్ ఎడ్జెస్ట్ కాలేదు అంటూ బన్నీకి హ్యాండ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక హీరోయిన్ గా వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్నను తీసుకున్నారు. అన్నిటికంటే మ్ముఖ్యంగా ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఎప్పుడూ బిజీగా ఉండే దేవీ ఈసారి కూల్‌ గా తీరిగ్గా కూర్చుని ట్యూన్స్ కంపోజ్ చేస్తుండటంతో మ్యూజిక్ పై అంచనాలు పెరుగుతున్నాయి.