Homeఎంటర్టైన్మెంట్రాజమౌళి పై బోనీ కపూర్ సీరియస్ !

రాజమౌళి పై బోనీ కపూర్ సీరియస్ !

Bonnie Kapoor
రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా అక్టోబర్ 13న విడుదల అని ప్రకటించగానే బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఫైర్ అయ్యాడు. అజయ్ దేవగన్ హీరోగా బోనీ కపూర్ నిర్మించిన “మైదాన్” సినిమా కూడా అక్టోబర్ 13న విడుదల అని బోనీ కపూర్ ఇంతకుముందే ప్రకటించాడు. ‘ఆర్ఆర్ఆర్’లో అజయ్ దేవగన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. మరి, అజయ్ నటించిన రెండు సినిమాలు ఒకే రోజు విడుదలైతే నార్త్ ఇండియన్ మార్కెట్ లో మాకు నష్టం వస్తోందని బోనీ కపూర్ ఫీల్ అవుతున్నాడు. రాజమౌళి సినిమా అంటే.. దేశమంతా పెద్ద ఎత్తున విడుదల అవుతుంది కాబట్టి.. కచ్చితంగా ‘మైదాన్’కి పెద్ద దెబ్బే అని చెప్పాలి.

కాబట్టి ‘మైదాన్’ సినిమా డేట్ ని మార్చాల్సిన పరిస్థితి ఇప్పుడు తప్పనిసరి. ఇక ఎస్.ఎస్.రాజమౌళి తన సినిమాల్లో పాత్రలను ఎంత పకడ్బంధీగా రాసుకుంటారో ఆ పాత్రలోకి నటీ నటుల్ని కూడ అంతే జాగ్రత్తగా ఎంచుకుంటారు. ఈ లెక్కన అజయ్ దేవగన్ పాత్ర కూడా చాల బలంగా ఉంటుంది. అంతే బలంగా మైదాన్ లో ఉంటుందని గ్యారంటీ లేదు. ఇక డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

కాగా రేపటి నుండి జరగబోయే షూట్ లో ఎన్టీఆర్ యాక్షన్ సీన్స్ ను తెరకెక్కించడానికి రాజమౌళి ప్లాన్ చేయిస్తున్నాడని తెలుస్తోంది. కాగా తారక్ పై ఇంటర్వెల్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ కావడంతో.. సీన్స్ లో పిరంగలిలో పేల్చే షాట్స్ కూడా అంతే స్థాయిలో తీయాలని రాజమౌళి ఆ షాట్స్ ను మాత్రం గ్రీన్ మ్యాట్ లో షూట్ చేసి.. సిజీ వర్క్ చేయించబోతున్నాడు. మొత్తానికి సినిమాని అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version