Bigg Boss Telugu 8: లేటెస్ట్ ప్రోమో చూశారా? అద్భుత దీపం జీనీ గెటప్ లో నాగార్జున! ఒక్కసారి కమిట్ అయితే నో లిమిట్!

బిగ్ బాస్ తెలుగు 8 ప్రారంభం కావడానికి మరో నెల రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రమోషన్స్ షురూ చేశారు. వరుసగా ప్రోమోలు విడుదల చేస్తున్నారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కాన్సెప్ట్ ప్రోమో అదిరింది. అద్భుత దీపం నుండి జీనీ గెటప్ లో నాగార్జున దర్శనం ఇచ్చాడు. బిగ్ బాస్ తెలుగు 8 సెకండ్ ప్రోమో ఎలా ఉందో చూద్దాం..

Written By: S Reddy, Updated On : August 2, 2024 8:16 pm
Follow us on

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ లవర్స్ కి సీజన్ 8 ఫీవర్ పట్టేసింది. ఇంకా నాలుగు వారాల సమయం ఉండగానే ఆ మేనియాతో ఊగిపోతున్నారు. సెప్టెంబర్ 8న బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లాంచింగ్ ఎపిసోడ్ అని గట్టిగా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారం అవుతున్న కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ సెప్టెంబర్ 1న ముగియనుందట. ఆ నెక్స్ట్ ఆదివారం బిగ్ బాస్ 8 లాంచింగ్ డే అంటున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

కింగ్ నాగార్జున మరోసారి హోస్టింగ్ బాధ్యతలు చేపట్టనున్నారు. నాగార్జున అధికారిక సోషల్ మీడియా అకౌంట్ ద్వారా బిగ్ బాస్ తెలుగు 8 లోగో విడుదల చేశాడు. బిగ్ బాస్ 8 లోగో ఆడియన్స్ లో ఆసక్తి రేపింది. కాగా బిగ్ బాస్ సీజన్ 8 నుండి సెకండ్ ప్రోమో సైతం వచ్చేసింది. లేటెస్ట్ సీజన్ ఎలా ఉంటుందో హింట్ ఇస్తూ ప్రోమో డిజైన్ చేశారు. కమెడియన్ సత్య ఈ ప్రోమోలో నటించడం విశేషం.

దొంగతనానికి వెళ్లిన సత్య అద్భుత దీపాన్ని తాకుతాడు. అందులోనుండి జీనీ బయటకు వస్తాడు. నీకు ఏమి కావాలో కోరుకో అని జీనీ గెటప్ లో నాగార్జున సత్యను అడుగుతాడు. ఏమి అడిగినా ఇస్తావా? అని సత్య సందేహం వ్యక్తం చేస్తాడు. ఏది అడిగినా అన్ లిమిటెడ్ గా ఇస్తా… కాకపోతే బాగా ఆలోచించి అడుగు. లేదంటే… ఇక్కడ ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు… అని నాగార్జున అంటాడు. అలా ప్రోమో ముగించారు.

ఈసారి బిగ్ బాస్ హౌస్లో ఎంటర్టైన్మెంట్ కి లిమిట్ లేదని అర్థమా లేక… కంటెస్టెంట్స్ కోరుకోవడాలు, వాటిని తీర్చడాలు వంటి కాన్సెప్ట్ ఏమైనా పెట్టారా? అప్పుడే దీనిపై క్లారిటీ రాదు. ఇంకొన్ని ప్రోమోలు వస్తే కానీ అంచనా వేయగలం. ఏది ఏమైనా బిగ్ బాస్ తెలుగు 8 సెకండ్ ప్రోమో అదిరింది. షో లాంచింగ్ డేట్ ప్రోమోలో పొందుపరచలేదు. ఇక బిగ్ బాస్ తెలుగు 8 కంటెస్టెంట్స్ వీరే అంటూ పలువురు సెలెబ్స్ పేర్లు తెరపైకి వస్తున్నాయి.

బమ్ చిక్ బబ్లు, రీతూ చౌదరి, విష్ణుప్రియ, అమృత ప్రణయ్, కుమారి ఆంటీ, యాదమ్మ రాజు, మై విలేజ్ షో అనిల్, కుషిత కల్లపు, సోనియా సింగ్, ప్రభాస్ శ్రీను కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఖచ్చితంగా ఉండే వీలుందట. ఇక అబ్బాస్, రోహిత్, వినోద్ కుమార్, అంబటి అర్జున్, వేణు స్వామి వంటి కొన్ని క్రేజీ నేమ్స్ వినిపిస్తున్నాయి. లాంచింగ్ ఎపిసోడ్ వరకు కంటెస్టెంట్స్ గా ఎంపికైంది ఎవరు అనేది సస్పెన్సు. అయితే ప్రతి సీజన్ కి ముందు కొన్ని పేర్లు లీక్ అవుతాయి.

ఇక సీజన్ 7 గ్రాండ్ సక్సెస్ నేపథ్యంలో సీజన్ 8 మరింత మజాగా రూపొందిస్తున్నారట. హోస్ట్ నాగార్జున సైతం భారీ రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తున్నారట. గతంలో ఎన్నడూ లేని విధంగా రూ. 25 కోట్లు నాగార్జునకు ఇస్తున్నారని సమాచారం.