Bigg Boss Telugu 8: అందరి గురించి మాట్లాడి యష్మీని పట్టించుకోని మణికంఠ..మనసులో పగ బాగా పెంచేసుకున్నాడుగా!

ఒక్క మెహబూబ్, గౌతమ్ తప్ప అందరూ మణికంఠ పై పీకలదాకా కోపంతో ఉన్నారు. ఇది వాస్తవం. కానీ ఎవ్వరూ బయటపడలేదు, యష్మీ మాత్రం బయటపడింది. మణికంఠ అంటే తనకి ఎంత ద్వేషమో చెప్పకనే చెప్పింది.

Written By: Vicky, Updated On : October 21, 2024 8:33 am

Bigg Boss Telugu 8(139)

Follow us on

Bigg Boss Telugu 8: గత సీజన్ లో పల్లవి ప్రశాంత్ లాగా ఈ సీజన్ లో మణికంఠ నిలుస్తాడని, కచ్చితంగా టైటిల్ గెలుస్తాడని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆయన 7 వారాలకే ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతాడని మాత్రం ఎవ్వరూ అనుకోలేదు. ఆరోగ్య సమస్యల కారణం చేత, టాస్కులు ఆడలేకపోతున్నాని, నా వైపు నుండి నూటికి నూరు శాతం ఇవ్వలేకపోతున్నాని, ఇలాంటి సందర్భంలో నేను బిగ్ బాస్ లో కొనసాగడం కరెక్ట్ కాదని, ఎప్పుడైతే నేను ఆడలేకపోతున్నాను అని నాకు అనిపించిందో, నా స్థానం లో అర్హులైన కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగడం న్యాయం అనిపించిందని, అందుకే సెల్ఫ్ ఎవిక్షన్ చేసుకున్నానని నాగమణికంఠ చెప్పుకొచ్చాడు. ఇదంతా పక్కన పెడితే మణికంఠకి హౌస్ లో నిజమైన స్నేహితులు ఎవ్వరూ లేరు. ఇది మాత్రం ముమ్మాటికీ నిజమే, నిన్న ఆయన వెళ్ళిపోతున్నప్పుడు కన్నీళ్లు పెట్టుకున్న నయనీ పావని కూడా మణికంఠ వెనుక చేరి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి.

ఒక్క మెహబూబ్, గౌతమ్ తప్ప అందరూ మణికంఠ పై పీకలదాకా కోపంతో ఉన్నారు. ఇది వాస్తవం. కానీ ఎవ్వరూ బయటపడలేదు, యష్మీ మాత్రం బయటపడింది. మణికంఠ అంటే తనకి ఎంత ద్వేషమో చెప్పకనే చెప్పింది. మొదటి రెండు వారాలు మణికంఠ యష్మీ తో మంచి స్నేహం చేసాడు. యష్మీ కూడా మణికంఠ కి చాలా గౌరవం ఇచ్చింది, అతనికి హౌస్ లో బాగా కనెక్ట్ అయ్యింది. కానీ ఎప్పుడైతే యష్మీ స్నేహం కొద్ది చనువుతో చెప్పిన మాటలను, మణికంఠ ‘మైక్రో మ్యానేజ్మెంట్’ గా భావించి నామినేషన్ లో వేశాడో అప్పటి నుండి యష్మీ మణికంఠ పై పగ పెంచేసుకుంది. నేను ఎన్ని రోజులైతే హౌస్ లో ఉంటానో, అన్ని రోజులు నిన్ను నామినేట్ చేస్తానని, హౌస్ కి నువ్వు చాలా డేంజర్ అంటూ ముఖం మీదనే చెప్పింది. అదే విధంగా మణికంఠ తో కూడా హౌస్ లో ఉన్నన్ని రోజులు ప్రవర్తించింది. వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ లో టేస్టీ తేజ మణికంఠ ని నామినేట్ చేసినప్పుడు యష్మీ సంబరాలు చేసుకుంది.

కానీ అది బయట చూసే ఆడియన్స్ కి చాలా నెగటివ్ గా వెళ్తుంది అని అవినాష్ యష్మీ ని నామినేట్ చేసి మరీ చెప్పడంతో అప్పటి నుండి ఆమె మణికంఠ తో మాట్లాడడం పూర్తిగా మానేసింది. కేవలం ఒకటి రెండు సందర్భాలలో తప్ప యష్మీ, మణికంఠ మాట్లాడుకోవడం ఈమధ్య మనం చూడలేదు. అలాగే మణికంఠ ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతున్నప్పుడు కూడా యష్మీ అతన్ని పలకరించలేదు. అదే విధంగా మణికంఠ కూడా యష్మీ ని పట్టించుకోలేదు. స్టేజి మీదకు వచ్చిన తర్వాత నాగార్జున బోటులో ఎవరిని ఎక్కిస్తావు..?, ఎవరిని ముంచేస్తావు అనే టాస్క్ పెట్టగా, అందరి కంటెస్టెంట్స్ గురించి మణికంఠ మాట్లాడుతాడు కానీ, యష్మీ గురించి మాత్రం మాట్లాడడు. దీంతో వీళ్లిద్దరి మధ్య గొడవ తారా స్థాయిలో ఉందని చూసే ఆడియన్స్ కి అనిపించింది.