Bigg Boss Telugu 8: డేంజర్ జోన్ లోకి నలుగురు కంటెస్టెంట్స్..నలుగురికి సమానమైన ఓట్లు..ఎలిమినేషన్ బిగ్ బాస్ చేతుల్లోనే!

ప్రేరణ తర్వాత అత్యధిక ఓట్లను దక్కించుకొని టాప్ 2 లో ఉన్న కంటెస్టెంట్ గా నిఖిల్ నిలిచాడు. అయితే డేంజర్ జోన్ విషయం లో ఈసారి అనూహ్యమైన పరిణామం చోటు చేసుకుంది. ప్రతీ వారం డేంజర్ జోన్ లోకి ఇద్దరు వస్తుంటారు.

Written By: Vicky, Updated On : October 25, 2024 8:13 am

Bigg Boss Telugu 8(157)

Follow us on

Bigg Boss Telugu 8: గత వారం నాగ మణికంఠ బిగ్ బాస్ హౌస్ నుండి తనకి తానుగా సెల్ఫ్ ఎలిమినేట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ వారం నామినేషన్స్ మొత్తం ఫుల్ ఫైర్ గా జరిగాయి. అలా ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వెళ్లేందుకు ప్రేరణ, నిఖిల్, మెహబూబ్, నయనీ పావని, విష్ణు ప్రియ, మరియు పృథ్వీ నామినేట్ అయ్యారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం ప్రేరణ కి అందరికంటే అత్యధిక ఓట్లు పడుతున్నాయి. మొదటి వారం నుండి ఫామ్ కోల్పోకుండా అత్యధిక ఓట్లను దక్కించుకుంటూ నెంబర్ 1 స్థానాన్ని మైంటైన్ చేస్తున్న నిఖిల్ ని సైతం భారీ మార్జిన్ తో వెనక్కి నెట్టడం అనేది చిన్న విషయం కాదు. ఈ వారం నామినేషన్స్ లో ఆమె తనని తానూ డిఫెండ్ చేసుకున్న తీరు ఆ రేంజ్ లో ఉన్నింది. హౌస్ మేట్స్ అందరూ ఆమెని దారుణంగా టార్గెట్ చేసారు.

ప్రేరణ తర్వాత అత్యధిక ఓట్లను దక్కించుకొని టాప్ 2 లో ఉన్న కంటెస్టెంట్ గా నిఖిల్ నిలిచాడు. అయితే డేంజర్ జోన్ విషయం లో ఈసారి అనూహ్యమైన పరిణామం చోటు చేసుకుంది. ప్రతీ వారం డేంజర్ జోన్ లోకి ఇద్దరు వస్తుంటారు. ఒక్కోసారి కొన్ని ప్రత్యేక సంఘటనలు హౌస్ లో జరగడం వల్ల ముగ్గురు కూడా డేంజర్ జోన్ లోకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ వారం మాత్రం ఒకరు కాదు, ఇద్దరు కాదు , ఏకంగా నలుగురు డేంజర్ జోన్ లోకి వచ్చినట్టు చెప్తున్నారు. ఆ నలుగురిలో విష్ణు ప్రియ కూడా ఉండడం గమనార్హం. నిఖిల్ కంటే అత్యధిక ఓట్లు దక్కించుకునే రేంజ్ నుండి విష్ణు ప్రియ ఈరోజు ఇలా డేంజర్ జోన్ లోకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఈమె మంచి అమ్మాయి, హౌస్ లో ఎలాంటి మాస్క్ లేకుండా, ఎంత నిజాయితీ గా ఉండాలో అంత నిజాయితీ గా ఉంది. బయట జనాలు ఏమని అనుకుంటారు అనేది ఆలోచించకుండా విష్ణు ప్రియ ఆడుతుంది.

కానీ ఆమె తన కోసం కాకుండా పృథ్వీ కోసం ఆడుతుండడం జనాలు అసలు ఇష్టపడడం లేదు. 24 గంటలు పృథ్వీ చుట్టూనే తిరుగుతుంది. దీంతో ఆమె అభిమానులు కూడా ఓట్లు వేయడం ఆపేసారు. అందుకే ఇప్పుడు డేంజర్ జోన్ లోకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఆమె ఘాడంగా ప్రేమిస్తున్న పృథ్వీ కూడా డేంజర్ జోన్ లో ఉన్నాడు. కానీ నిన్న ఈయన టాస్కులు ఆడిన విధానం కి ఆయన ఓటింగ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే రాయల్ క్లాన్ నుండి నామినేట్ అయినా మెహబూబ్, నయనీ పావని బాటమ్ చివరి రెండు స్థానాల్లో ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నలుగురికి కూడా సరిసమానమైన ఓటింగ్ పడుతుంది. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఇక బిగ్ బాస్ చేతుల్లోనే ఉంది.