Bigg Boss Telugu 7: తేజా-శోభా మధ్య చిచ్చు పెట్టిన అమర్… కొట్టుకునే వరకు వెళ్లిన వ్యవహారం!

అప్పుడే అమెరికా నుంచి వచ్చిన ఎన్ ఆర్ ఐ ప్రిన్స్ ఎంట్రీ ఇస్తాడు. నాకు పల్లి కావాలి అంటూ వచ్చి రాని తెలుగుతో అడుగుతాడు.ఇక ఆ తర్వాత మాజీ సర్పంచ్ తేజా కి మాజీ భార్య శోభా తో గొడవ జరుగుతుంది.

Written By: Vicky, Updated On : October 18, 2023 6:16 pm

Bigg Boss Telugu 7

Follow us on

Bigg Boss Telugu 7: బిగ్ బాస్ ఏడో వారం నామినేషన్స్ హోరా హోరీగా సాగాయి. ఏడుగురు కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. భోలే, అశ్విని, పూజా మూర్తి,శోభా శెట్టి,అమర్ దీప్,తేజ,ప్రశాంత్ లిస్ట్ లో ఉన్నారు. ఇక ఈ రోజు బిగ్ బాస్ కెప్టెన్సీ కోసం ఒక కొత్త టాస్క్ ఇచ్చాడు.ఇందులో భాగంగా హౌస్ లోకి ఒక స్పేస్ షిప్ అందులో గ్రహాంతర వాసులు వచ్చినట్లుగా సెటప్ చేశారు. హౌస్ మేట్స్ ని రెండు టీమ్స్ గా విభజించారు. ఒకరిది జిలేబి పురం మరో టీం గులాబీ పురం గ్రామస్థులుగా వ్యహరించాలి. ఇరు టీమ్స్ లో ఎవరైతే గ్రహాంతర వాసులుని మెప్పిస్తారో వారు కెప్టెన్సీ పోటీదారులుగా నిలుస్తారు.

దీని కోసం శోభా తేజ కి విడాకులు ఇచ్చిన మాజీ భార్యగా నటించాలి. అమర్ ఊళ్లో ఉన్న విషయాలు పక్క వాళ్ళకి జారేసే ఒక టీ కొట్టు వాడు. యావర్ పల్లెటూరి అమ్మాయి కోసం వెతుకుతున్న ఎన్ ఆర్ ఐ. ఇలా అందరూ ఎవరి పాత్రల్లో వారు పల్లెటూరి గెటప్స్ లో కనిపించారు. ఆ తర్వాత శోభా అమర్ టీ కొట్టుకి వచ్చి ‘ఊళ్ళో ఏంటి రా విశేషాలు’ అని అమర్ తో అనగానే మాజీ సర్పంచ్ గా ఉన్న తేజా పైన చాడీలు చెబుతాడు.

అప్పుడే అమెరికా నుంచి వచ్చిన ఎన్ ఆర్ ఐ ప్రిన్స్ ఎంట్రీ ఇస్తాడు. నాకు పల్లి కావాలి అంటూ వచ్చి రాని తెలుగుతో అడుగుతాడు.ఇక ఆ తర్వాత మాజీ సర్పంచ్ తేజా కి మాజీ భార్య శోభా తో గొడవ జరుగుతుంది. ఇద్దరు కలిసి మద్యలో ఉన్న అమర్ ని వాయించేస్తారు. ఇదంతా సరదాగా సాగింది. ఇక అర్జున్,ప్రశాంత్, ప్రియాంక,శివాజీ, అశ్విని వివిధ పాత్రల్లో కనిపించారు.

అశ్విని జిలేబి పురం లో మంచి అందగత్తెలా మెరిసింది. ఆమెను పడేయాలని అర్జున్ ఇంకా శివాజీ తెగ ట్రై చేశారు. ప్రశాంత్ అర్జున్ కి చెంచా గా నటించాడు. ఈ వారం ఫిజికల్ టాస్క్లు పక్కన బెట్టి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసే పనిలో పడ్డారు బిగ్ బాస్. మనకు పల్లెటూరుల్లో కనిపించే ఫేమస్ క్యారక్టర్స్ ని గుర్తుచేస్తూ టాస్క్ లో వినోదాన్ని నింపారు బిగ్ బాస్. మరి జిలేబి పురం, గులాబీ పురం టీమ్స్ లో ఎవరు నెగ్గుతారో చూడాలి.