Bigg Boss 7 Telugu: ఎపిసోడ్ హైలెట్స్: అమర్ ని కుక్క తోకన్న భోలే, ఎలిమినేషన్ లో షాకింగ్ ట్విస్ట్!

ఆ తర్వాత అమర్ దీప్ 'గాడిదకు ఏం తెలుసు గంధపు చెక్క వాసన' అనే సామెత అశ్విని మెడలో వేశాడు. ఒక డెసిషన్ నుంచి మరో డెసిషన్ వెంటనే చేంజ్ అయిపోతుంది అని అమర్ రీజన్ చెప్పాడు.

Written By: Neelambaram, Updated On : November 6, 2023 10:25 am
Follow us on

Bigg Boss 7 Telugu:  బిగ్ బాస్ సన్ డే కావడంతో కంటెస్టెంట్స్ తో ఫన్నీ గేమ్స్ ఆడించారు నాగార్జున. అయితే కొన్ని సామెతలు బోర్డులు ఇచ్చి అవి ఎవరికీ సూట్ అవుతాయో చెప్పమని చెప్పారు నాగార్జున. కాగా ముందుగా భోలే కి అవకాశం వచ్చింది. భోలే కి ‘కుక్క తోక వంకర’ అనే బోర్డు వచ్చింది. దానిని అమర్ మెడలో వేశాడు. నాకు తను ఆటల్లో బాగా నచ్చుతాడు సార్ .. నామినేషన్ లో రివేంజ్ అనే పదం వాడి వెంటనే పగ తీర్చుకున్నాడు అని భోలే చెప్పాడు. ఓకే మారట్లేదు అమర్ అంటావ్ వేసెయ్ ఆ బోర్డు అని నాగార్జున చెప్పారు.

ఆ తర్వాత అమర్ దీప్ ‘గాడిదకు ఏం తెలుసు గంధపు చెక్క వాసన’ అనే సామెత అశ్విని మెడలో వేశాడు. ఒక డెసిషన్ నుంచి మరో డెసిషన్ వెంటనే చేంజ్ అయిపోతుంది అని అమర్ రీజన్ చెప్పాడు. తర్వాత ‘ఏకులా వచ్చి మేకులా తగులుకున్నాడు’ అంటూ అర్జున్ సామెత బోర్డు ని ప్రశాంత్ మెడలో వేశాడు. వచ్చినప్పుడు ఎవరూ వీడు ఇంత బాగా ఆడతాడని ఎక్సపెక్ట్ చేసుండరు.. రాణించలేడు అనుకుంటే మేకులా కూర్చున్నాడు అని అర్జున్ చెప్పాడు.

తర్వాత ప్రశాంత్.. తేజ మెడలో ‘ఏమి లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది’ అనే సామెత బోర్డు వేశాడు. మేటర్ ఎం ఉండదు సార్.. కానీ లొల్లి మాత్రం ఉంటది అని ప్రశాంత్ చెప్పాడు. దీంతో వర్రీ అవ్వకు తేజ ఆకు కూడా టేస్ట్ లో ఒక భాగమే అని నాగార్జున అన్నారు. ఇక ప్రియాంక ‘నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది’ అనే సామెత అశ్విని కి ఇచ్చింది. ముందు ఒక మాట అనేసి.. తర్వాత నేను అలా అనలేదు అని చెప్తుంది సార్ అంటూ ప్రియాంక రీజన్ చెప్పింది.

ఇక చివరిగా ‘పొరుగింటి పుల్లకూర రుచి ఎక్కువ అనే సామెత భోలే కి ఇచ్చాడు తేజ. నాకేంటే వంట బాగా చేస్తున్నారు కానీ అప్పుడప్పుడు నా కూరలపై పడి ఏడుస్తున్నాడు సార్ అని తేజా చెప్పాడు. ఇక జిగర్తాండ డబుల్ ఎక్స్ లో భాగంగా లారెన్స్, ఎస్ జే సూర్య బిగ్ బాస్ వేదిక మీదకు వచ్చారు. కంటెస్టెంట్స్ తో డాన్స్ కి సంబంధించిన సరదా గేమ్ ఆడాడు. కంటెస్టెంట్స్ గేమ్స్ ఆడుతున్నప్పటికీ ఎలిమినేషన్ టెన్షన్ ఫీల్ అయ్యారు.

నామినేషన్స్ లో 8 మంది ఉన్నారు. ఒక్కొక్కరిగా సేవ్ అవుతూ వచ్చారు. చివరికి యావర్, తేజ, రతిక మిగిలారు. ఈ ముగ్గురిలో యావర్ సేవ్ అయ్యాడు. తేజ-రతిక లలో ఎవరు ఎలిమినేట్ కానున్నారనే టెన్షన్ మొదలైంది. ఇద్దరినీ గార్డెన్ ఏరియాకు పిలిచిన నాగార్జున తన పక్కనే ఉన్న బోర్డు పై ఎవరి పేరు డిస్ప్లే వారు ఎలిమినేట్ అని నాగార్జున చెప్పారు. రతిక ఎలిమినేట్ అవుతుందని ఫిక్స్ అయ్యింది. ఏడుస్తూ వన్ వీక్ ఛాన్స్ ఇవ్వండి, ఎలిమినేట్ చేయొద్దని వేడుకుంది. నా చేతిలో ఏమీ లేదు ఓటింగ్ ముగిసిందని నాగార్జున అన్నారు. ఉత్కంఠ మధ్య తేజ ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు.

తేజ హుందాగా ఇంటిని వీడదు. శోభతో పాటు కొందరు బాగా ఫీల్ అయ్యారు. ఇంటి సభ్యులకు మార్క్స్ వేస్తూ తన అభిప్రాయం చెప్పిన తేజ నేరుగా సొంత ఇంటికి బయలుదేరాడు. తేజ ఎలిమినేషన్ తో హౌస్లో 11 మంది సభ్యులు మిగిలారు.