Bigg Boss 7 Telugu: శివాజీ మ్యాచ్ ఫిక్సింగ్ పై సంచలన నిజాలు బయటపెట్టిన గౌతమ్

ఈ గేమ్ గోనె సంచుల గేమ్. ఇందులో పోటీలో ఉన్న వారు తమ బస్తాలను ఫ్రీగా ఉన్న ఇతరులకు ఇచ్చి వారిచేత ఆడించాలి. వాటిని పక్క వారు ఖాళీ చేయాలి. ఒక్కో రౌండ్ కి ఎవరి బస్తా తక్కువ ఉంటే వారు ఎలిమినేట్ అవుతుంటారు.

Written By: Suresh, Updated On : November 4, 2023 12:28 pm

Bigg Boss 7 Telugu

Follow us on

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభమైన కొత్తలో కాస్త డల్ గా ఉన్నా.. ఇప్పుడు మాత్రం ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది ఈ షో. గేముల్లో కంటెస్టెంట్ల ఆటతీరు రసవత్తరంగా సాగుతోంది. టాస్క్ ల కోసం రెచ్చిపోయి ఆడుతున్నారు కూడా. ఫిజికల్ అవుతున్నారు. కంట్రోల్ తప్పుతున్నారు. కొట్టుకుంటున్నారు. తిట్టుకుంటున్నారు. అవసరం అయితే పర్సనల్ విషయాలను తీసి పరువు తీసే వరకు వెళ్తున్నారు. శృతి మించి మాటలు కూడా వదిలేస్తున్నారు. అసలు బిగ్ బాస్ అంటే ఏంటో కూడా అర్థం అవడం లేదు. అసలు బిగ్ బాస్ ఎందుకు పెట్టారో.. సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారో కూడా ఎవరికి అర్థం కావడం లేదట. ఇదిలా ఉంటే నిన్న జరిగిన ఎపిసోడ్ లో ఇచ్చిన టాస్క్ లో వీరసింహాలు టీమ్ గెలిచింది.

ఈ గేమ్ గోనె సంచుల గేమ్. ఇందులో పోటీలో ఉన్న వారు తమ బస్తాలను ఫ్రీగా ఉన్న ఇతరులకు ఇచ్చి వారిచేత ఆడించాలి. వాటిని పక్క వారు ఖాళీ చేయాలి. ఒక్కో రౌండ్ కి ఎవరి బస్తా తక్కువ ఉంటే వారు ఎలిమినేట్ అవుతుంటారు. ఈ గేమ్ ఆడే సందర్భంలో అమర్ దీప్ రెచ్చిపోయాడు. గట్టి గట్టిగా అరుస్తూ రచ్చ రచ్చ చేశాడు. ఏకంగా అశ్విని తనను కొట్టిందని ఆరోపించాడు అమర్. అటు ఆమె కూడా నాపై నలుగురు అటాక్ చేశారంటూ తెలిపింది. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్దమే నడించింది. మరోవైపు భోలే కూడా తనని కొడుతున్నారు అని ఆరోపించాడు. దానికి కూడా అమర్ దీప్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.

రతిక మధ్యలో వస్తే ఆమెపై కూడా ఫైర్ అయ్యాడు. కంట్రోల్ తప్పి మాటలు వదిలేశాడు. గేమ్ ను హీటెక్కించాడు. ఇక ఈ టాస్క్ లో చివరగా తేజ తరపున ఆడిన ప్రియాంక వద్ద ఎక్కువ ఖాళీ అవడంతో అమర్ దీప్ వద్ద ఉన్న సంచి నిండుగా ఉండి శోభా విన్నర్ గా నిలిచింది. దీంతో మొదటి సారి హౌజ్ లో లేడీ కెప్టెన్ అయింది. ఇదే సమయంలో అర్జున్ చేసిన కామెంట్ కి శోభా సీరియస్ అయింది. దీంతో కామెడీ కాస్త ట్రాక్ తప్పి సీరియస్ గా సాగింది.

మరో వైపు అశ్వినికి సంబంధించి గౌతమ్ చేసిన కామెంట్లు కూడా మనస్పర్థాలకు దారి తీశాయి. ఇంకోవైపు తనని శివాజీ అన్నం దూరం పెడుతున్నాడని, సరిగా చూసుకోవడం లేదని, కొందరిలో మాత్రమే ఎంకరేజ్ చేస్తున్నాడని అశ్విని ఆరోపించింది. కన్నీళ్లు కూడా పెట్టుకుంది. చివరలో గౌతమ్ కూడా పెద్ద షాక్ ఇచ్చాడు. తాను మళ్లీ కెప్టెన్ కాకుండా చేయాలని మ్యాచ్ ఫిక్సింగ్ చేశారని ఆరోపించారు. అలా హౌజ్ మొత్తం రాంగ్ రూట్ లో వెళ్తుందని, తప్పులు చేసి కవర్ చేసుకుంటున్నారని తెలిపారు. తనకు వ్యతిరేకంగా శివాజీ ఈ ప్లాన్ చేస్తున్నాడని, తాను చూడలేకపోతున్నానని, అన్యాయం జరుగుతుందని, తనని డైరెక్ట్ ఎలిమినేట్ చేసి ఇంటికి పంపండి అని తెలిపాడు. దీంతో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.