Bigg Boss 7 Telugu: 19వ రోజు హైలెట్స్.. కన్నీరు పెట్టించిన యావర్ కథ, భార్యాభర్తలుగా మారిన గౌతమ్-శుభశ్రీ!

పల్లవి ప్రశాంత్-శుభశ్రీ మధ్య ఫన్నీ మూమెంట్స్ చోటు చేసుకున్నాయి. దూరంగా ఉన్న గౌతమ్ కృష్ణను చూపిస్తూ... అడుగో నీ లవర్ అన్నట్లు పల్లవి ప్రశాంత్ సైగలు చేశాడు. దానికి బదులుగా రతికా రోజ్ పేరు చెబుతూ... ఆమెకు నువ్వు లైన్ ఏస్తున్నావ్ అన్నట్లు శుభశ్రీ సైగలు చేసింది.

Written By: Shiva, Updated On : September 23, 2023 8:27 am

Bigg Boss 7 Telugu

Follow us on

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 ఆసక్తికరంగా సాగుతుంది. అయితే బిగ్ బాస్ నిర్ణయాలు ఒక విధంగా పక్షపాతంగా ఉంటున్నాయేమో అనిపిస్తుంది. మూడో కంటెండర్ టాస్క్స్ లో శోభా శెట్టి, ప్రియాంకలకు ఫేవర్ చేసిన బిగ్ బాస్… గౌతమ్ కృష్ణ, యావర్ లకు అన్యాయం చేసిన సూచనలు కనిపించాయి. పవర్ అస్త్ర రేసులో శుభశ్రీ, ప్రియాంక, ప్రిన్స్ యావర్ నిలిచిన నేపథ్యంలో ఆ ముగ్గురిలో మెజారిటీ సభ్యుల నిర్ణయం ప్రకారం ఒకరిని తప్పించాలి అన్నారు.యావర్ ని తొలగించాలని ప్రియాంక-శోభా శెట్టి చెప్పడంతో అతడు పవర్ అస్త్ర గెలిచే ఛాన్స్ కోల్పోయాడు.

దాంతో ఆగ్రహానికి గురయ్యాడు. గార్డెన్ ఏరియాలో ఉన్న బెంచ్ పగలగొట్టారు. అనంతరం బిగ్ బాస్ కి సారీ చెప్పాడు. శివాజీ వద్ద తన బాధ వెళ్లగక్కుకున్నాడు. ఆకలి నుండి పుట్టిన ఆవేశం నాది. నా అకౌంట్లో జీరో బ్యాలన్స్ ఉంది. నాకు రెండు మూడు ప్యాంట్స్ మాత్రమే ఉన్నాయి. కొత్త బట్టలు పంపమని కుటుంబ సభ్యులను నేను అడగడం లేదు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి నాకు తెలుసంటూ కన్నీరు పెట్టుకున్నాడు. శివాజీ అతన్ని ఓదార్చాడు. నీకు కూడా టైం వస్తుంది. దేవుడు ఉన్నాడు అన్నాడు. యావర్ పరిస్థితి తెలిశాక అందరికీ బాధ కలిగింది.

పల్లవి ప్రశాంత్-శుభశ్రీ మధ్య ఫన్నీ మూమెంట్స్ చోటు చేసుకున్నాయి. దూరంగా ఉన్న గౌతమ్ కృష్ణను చూపిస్తూ… అడుగో నీ లవర్ అన్నట్లు పల్లవి ప్రశాంత్ సైగలు చేశాడు. దానికి బదులుగా రతికా రోజ్ పేరు చెబుతూ… ఆమెకు నువ్వు లైన్ ఏస్తున్నావ్ అన్నట్లు శుభశ్రీ సైగలు చేసింది. అనంతరం గౌతమ్ కృష్ణ, శుభశ్రీ భార్యాభర్తలుగా, శివాజీ మామగా ఓ ఫన్నీ స్కిట్ చేశారు. అది నవ్వులు పూయించింది.

ఇక యావర్ కూడా కంటెండర్ రేసు నుండి తప్పుకోగా ఫైనల్ లో ప్రియాంక-శుభశ్రీ పోటీపడ్డారు. యంత్రపు ఎద్దుపై సవారీ అనే టాస్క్ విధించాడు బిగ్ బాస్. ఇద్దరు తలో మూడు రౌండ్స్ ఎద్దు మీద ఎక్కి కుదుపులకు పడిపోకుండా గట్టిగా పట్టుకోవాలి. ప్రియాంక, శోభా ఒకరికొకరు మంచి పోటీ ఇచ్చారు. ఈ టాస్క్ లో శోభా శెట్టికి చిన్న గాయమైంది. వీరిలో విజేత ఎవరనేది నేడు నాగార్జున చెబుతారని బిగ్ బాస్ చెప్పాడు. ఇవాళ శనివారం కాగా నాగార్జున రంగంలోకి దిగుతారు…