
ఇస్మార్ట్ శంకర్ సినిమా సక్సెస్ తో బౌన్స్ బ్యాక్ అయిన పూరి జగన్నాథ్ ప్రస్తుతం ‘ఫైటర్’ సినిమా రూపొందిస్తున్నాడు. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాను, తెలుగుతో పాటు ఇతర భాషల్లోను విడుదల చేయాలనే సంకల్పం తో నిర్మిస్తున్నాడు. కాగా ఈ సినిమా తరువాత పూరి జగన్నాధ్ తదుపరి మూవీ ఏ హీరోతో నిర్మిస్తాడు అని అందరూ ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు .
అలాంటి టైములో తాజాగా బాలకృష్ణ పేరు తెరపైకి వచ్చింది. గతంలో బాలకృష్ణతో ‘పైసా వసూల్’ చేసిన పూరి జగన్నాధ్ ,రీసెంట్ గా బాలకృష్ణకి కాల్ చేసి కథ వినిపించాడట. కథలో కొత్తదనం కారణంగా వెంటనే బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది,.ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో చేస్తున్న ‘ఫైటర్’ సినిమా పూర్తి కాగానే ఈ బాలకృష్ణ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది .
మాస్ ఆడియన్స్ పల్స్ బాగా తెలిసిన పూరీ జగన్నాధ్ ఈ సారి బాలయ్య బాబు కి హిట్ సినిమా ఇవ్వాలి అన్న కసితో కథ తయారు చేసాడట ..2017 లో మాస్ ఇమేజ్ వున్న బాలకృష్ణతో ‘పైసా వసూల్’ అనే సినిమా చేశాడు పూరీ జగన్నాధ్..అంతేకాదు . ఆ సినిమా లో బాలకృష్ణను చాలా స్టైలీష్ గా చూపించాడు. అందుకే బాలయ్య బాబుకి పూరీ జగన్నాధ్ అంటే వల్లమాలిన అభిమానం.