అనుష్క ‘నిశ్శబ్దం’.. ఇంట్రెస్టింగ్ అప్డేట్

స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో యంగ్ డైరెక్టర్ హేమంత్ మధుకర్ డైరెక్షన్ లో రాబోతున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘నిశ్శబ్దం’. కాగా ఈ సినిమా గురించి ఫిల్మ్ సర్కిల్స్ లో ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఈ సినిమా ఓ మర్డర్ చుట్టూ తిరిగే సస్పెన్స్ థ్రిల్లర్ అని, సినిమా మర్డర్ చేసింది ఎవరు అనే కోణంలోనే చాల భాగం నడుస్తోందని.. అయితే మర్డర్ చేసేది అనుష్కనేనని… ఈ విషయం క్లైమాక్స్ లో ట్విస్ట్ రూపంలో […]

Written By: admin, Updated On : June 16, 2020 6:45 pm
Follow us on


స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో యంగ్ డైరెక్టర్ హేమంత్ మధుకర్ డైరెక్షన్ లో రాబోతున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘నిశ్శబ్దం’. కాగా ఈ సినిమా గురించి ఫిల్మ్ సర్కిల్స్ లో ఓ ఇంట్రస్టింగ్ అప్ డేట్ తెలిసింది. ఈ సినిమా ఓ మర్డర్ చుట్టూ తిరిగే సస్పెన్స్ థ్రిల్లర్ అని, సినిమా మర్డర్ చేసింది ఎవరు అనే కోణంలోనే చాల భాగం నడుస్తోందని.. అయితే మర్డర్ చేసేది అనుష్కనేనని… ఈ విషయం క్లైమాక్స్ లో ట్విస్ట్ రూపంలో రివీల్ అవుతుందని.. సినిమాలో మంచి ఎమోషనల్ కంటెంట్ ఉందని తెలుస్తోంది.

ఇక ఈ సినిమా ట్రైలర్ లోనే ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ తో పాటు బ్యూటిఫుల్ విజువల్స్, మరియు అనుష్క, మాధవన్ ల మధ్య రిలేషన్ అలాగే మిగిలిన క్యారెక్టర్స్ యొక్క యాక్టివిటీస్ అండ్ హారర్ ఎఫెక్ట్స్ ను టీజర్ లో బాగా ఎస్టాబ్లిష్మెంట్స్ చేశారు. మొత్తానికి ఈ సినిమా ట్రైలర్ సినిమా పై అంచనాలను బాగా పెంచింది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమాలో అనుష్క ఆర్ట్ లవర్ గా కనిపించనుంది.

కాగా మాధవన్ ఈ చిత్రంలో సెల్లో ప్లేయర్ గా నటించనున్నాడు. వీరిద్దరి క్యారెక్టర్స్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటాయని తెలుస్తోంది. ముఖ్యంగా అనుష్క పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయట. ఇక ఈ చిత్రంలో సుబ్బరాజు, అంజలి, షాలిని పాండే తో పాటు ప్రముఖ హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడిసన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

‘భాగమతి’గా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్న అనుష్క.. మరి ఈ సినిమాతో కూడా సూపర్ హిట్ అందుకుంటుందేమో చూడాలి. రచయిత కోన వెంకట్ తన బ్యానర్‌ లో ఈ సినిమాని నిర్మిస్తున్నారు.