బాలీవుడ్ యువహీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య బాలీవుడ్ను తీవ్రంగా కలచివేస్తోంది. మానసిక ఒత్తిడి, ఒంటరి తన భరించలేకపోయిన ఈ యువ నటుడు ఆదివారం ముంబై బాంద్రాలోని తన ఇంట్లో సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకున్న సంగతి తెలిసిందే. సుశాంత్ మరణవార్త విని ఇండస్ట్రీ వర్గాలంతా షాక్కు గురయ్యారు. సూసైడ్ నోట్ లేకపోవడంతో అతని ఆత్మహత్యకు కారణం ఏమిటని ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో తల్లి మరణంతో పాటు మాజీ ప్రేయసి, నటి అంకితా లోఖండేతో ప్రేమ వైఫల్యం కూడా అతని కుంగుబాటు కారణం అని భావిస్తున్నారు.
గతంలో జీ టీవీలో ప్రసారమైన ‘ పవిత్రా రిష్తా’ సీరియల్ లో కలిసి నటించిన సుశాంత్, అంకిత ప్రేమలో పడ్డారు. ఆరేళ్ల పాటు సుశాంత్తో ప్రేమలో మునిగిన జంట 2016లో విడిపోయింది. బ్రేకప్కు ‘ఒంటరినని బాధపడకు, నేను నీ గుండెల్లో ఎప్పడు చిరస్థాయిగా నిలిచిపోతాను’ అని అంకిత ట్వీట్ కూడా చేసింది. సుశాంత్ ఆత్మహత్యపై అంకిత స్పందించింది. ఓ మీడియా ప్రతినిధి ఫోన్ చేసి చెప్పేంత వరకూ తనకు ఈ విషయం తెలియదని తెలిపింది. సుశాంత్ ఇకలేడని తెలిసి షాక్కు గురయ్యానని చెప్పింది.
కానీ, సుశాంత్ మరణించడానికి కొద్దిసేపటి ముందే తన ఇన్స్టాగ్రామ్లో అంకిత పెట్టిన ఓ పోస్ట్ చర్చనీయాంశమైంది. ‘దేవుడు కొంతమంది వ్యక్తులను మీ జీవితం నుంచి తొలగిస్తాడు. ఎందుకంటే మీరు వినని సంభాషణలను ఆయన విన్నాడు’ అని ఇన్స్టా స్టోరీలో రాసింది. అనంతరం దీన్ని డిలీట్ చేసింది. మరోవైపు సుశాంత్ది ఆత్మహత్యకాదు హత్యే అని ఆయన మేనమామ ఆరోపిస్తున్నారు. దీనిపై లోతుగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో అంకిత ఇన్స్టాలో రాసి.. డిలేట్ చేసిన పోస్ట్ చర్చనీయాంశమైంది. అప్పటికే ఈ స్టోరీని స్క్రీన్ షార్ట్ తీసిన పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. సుశాంత్ మరణంలో అంకిత పాత్ర కూడా ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులు దీన్ని ప్రశ్నించాలని డిమాండ్ చేస్తున్నారు.