Rajamouli – Mahesh : దేశాన్ని ఊపేస్తున్న యానిమల్, సైలెంట్ గా రాజమౌళి, మహేష్… కారణం?

ఏపీ/తెలంగాణాలలో మూడు రోజులకు ముప్పై కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. యానిమల్ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చినా కొందరు ఓపెన్ గానే పొగిడారు.

Written By: NARESH, Updated On : December 4, 2023 3:49 pm
Follow us on

Rajamouli – Mahesh : యానిమల్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఊపేస్తున్న సినిమా. నేడు రోజుల్లో యానిమల్ వరల్డ్ వైడ్ రూ. 360 కోట్ల వసూళ్లు రాబట్టింది. దాదాపు రూ. 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన యానిమల్ భారీ లాభాలు పంచడం ఖాయంగా కనిపిస్తుంది. వీకెండ్ నాటికే చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ దాటేసింది. యూఎస్ లో లాభాలు మొదలయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా యానిమల్ బ్రేక్ ఈవెన్ టచ్ చేసినట్లు సమాచారం. దిల్ రాజు రూ. 15 కోట్లకు యానిమల్ హక్కులు సొంతం చేసుకున్నారు.

ఏపీ/తెలంగాణాలలో మూడు రోజులకు ముప్పై కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. యానిమల్ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చినా కొందరు ఓపెన్ గానే పొగిడారు. బాలీవుడ్ క్రిటిక్స్, సెలెబ్స్ లో ఓ వర్గం రన్బీర్ నటన, సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ పై ప్రశంసలు కురిపించారు. అనూహ్యంగా రాజమౌళి, మహేష్ బాబు యానిమల్ విషయంలో సైలెన్స్ పాటిస్తున్నారు. యానిమల్ విడుదలై నాలుగు రోజులు అవుతున్నా మహేష్, రాజమౌళి స్పందించలేదు.

నిజానికి వీరిద్దరూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. స్పోర్ట్స్, సినిమా, సోషల్ ఈవెంట్స్ పై తమ స్పందన తెలియజేస్తారు. అందులోనూ యానిమల్ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మహేష్, రాజమౌళి గెస్ట్స్ గా వెళ్లారు. ఈ ఈవెంట్ లో రాజమౌళి అయితే సందీప్ రెడ్డి వంగను ఆకాశానికి ఎత్తారు. అప్పట్లో రామ్ గోపాల్ వర్మ, ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ అని గొప్ప కాంప్లిమెంట్ ఇచ్చాడు.

ఇక మహేష్ తాను రన్బీర్ కపూర్ అభిమానిని అన్నారు. తీరా సినిమా విడుదలయ్యాక తమ రివ్యూ ఇవ్వలేదు. ఈ క్రమంలో బాక్సాఫీస్ షేక్ చేస్తున్నప్పటికీ యానిమల్ మూవీ మహేష్, రాజమౌళిలకు నచ్చలేదా? అనే సందేహాలు కలుగుతున్నాయి. అయితే యానిమల్ మూవీలో వైలెన్స్, అడల్ట్ కంటెంట్ పరిమితికి మించి ఉంది. ఇలాంటి విషయాలను ప్రోత్సహించినట్లు ఉంటుంది. విమర్శలు రావచ్చని భయపడి సోషల్ మీడియాలో స్పందించకపోయి ఉండొచ్చని మరో వాదన వినిపిస్తుంది.