Homeఎంటర్టైన్మెంట్Anchor Rashmi Secret Marriage: రహస్యం గా జరిగిపోయిన యాంకర్ రష్మీ పెళ్లి

Anchor Rashmi Secret Marriage: రహస్యం గా జరిగిపోయిన యాంకర్ రష్మీ పెళ్లి

Anchor Rashmi Secret Marriage: బుల్లితెర మీద ప్రసారం అయ్యే జబర్దస్త్ అనే షో ద్వారా ఎంత మంది లైం లైట్ లోకి వచ్చారో మన అందరికి తెలిసిందే..ఈ షో ద్వారానే రష్మీ యాంకర్ గా పరిచయం అయ్యింది..అంతకు ముందు ఆమె పలు సినిమాలలో చేసిన రాని గుర్తింపు కేవలం ఈ కామెడీ షో ద్వారానే వచ్చింది..ఆ తర్వాత ఈమె ఎన్నో ఎంటెర్టైమెంట్ షోస్ కి యాంకర్ గా చెయ్యడమే కాకుండా కొన్ని సినిమాలలో హీరోయిన్ గా కూడా నటించింది..ఇక బుల్లితెర మీద రష్మీ మరియు సుడిగాలి సుధీర్ జోడికి ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..వీళ్ళ మధ్య కెమిస్ట్రీ ఏ రేంజ్ లో ఉంటుందంటే నిజంగానే వీళ్ళు లవర్స్..త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అని ప్రతి ఒక్కరు నమ్మేలా ఉంటుంది..కానీ ఇది కేవలం షో కోసం మాత్రమేనని..మేము కేవలం ఒక మంచి స్నేహితులం మాత్రమే అని ఇద్దరు పలు సందర్భాలలో తెలిపారు..మా మధ్య కనీసం ఫోన్ కాల్స్ కూడా ఉండవని..ఇన్నేళ్ల మా సుదీర్ఘ బుల్లితెర ప్రయాణం లో కేవలం రెండు మూడు సార్లు మాత్రమే ఫోన్ లో మాట్లాడుకున్నామని చెప్పుకొచ్చింది..కానీ వీళ్ళు ఎంత చెప్పినా వీళ్ళ మధ్య ఏమి లేదంటే ఎవ్వరు నమ్మలేకపొతున్నారు.

Anchor Rashmi's wedding took place in secret
Rashmi, Sudheer

Also Read: Sudigali Sudheer- Indraja: సుధీర్, ఇంద్రజకు ఉన్న రిలేషన్ ఇదేనట..: ఓపెన్ అయిన జబర్దస్త్ జడ్జి

ఇది ఇలా ఉండగా లేటెస్ట్ గా వినిపిస్తున్న గాసిప్ ఏమిటంటే రష్మీ కి ఇటీవలే రహశ్యం గా పెళ్లి జరిగిపోయిందట..ఈ విషయం బయటకి రాకుండా ఆమె చాల జాగ్రత్తలు తీసుకున్నట్టు సమాచారం..అయితే పెళ్ళైన విషయం గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏమిటి అనేది ఆమె అభిమానుల్లో మెలుగుతున్న ప్రశ్న..అయితే రష్మీ కేవలం సస్పెన్స్ మైంటైన్ చేస్తుందని..త్వరలోనే ఆమె శ్రీ దేవి డ్రామా కంపెనీ షో లో తన భర్త తో కలిసి వస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి..ఇంతకీ రష్మీ పెళ్లాడింది సుడిగాలి సుధీర్ నేనా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి..అందుకే రష్మీ ఈ విషయం ని గోప్యంగా ఉంచినట్టు తెలుస్తుంది..మరి ఇంతకీ రష్మీ పెళ్లాడింది ఎవరిని..అతను ఇండస్ట్రీ కి పరిచయం ఉన్న వ్యక్తేనా?..లేదా బయటవాడా..? లేదా అందరూ అనుకుంటున్నట్టు సుడిగాలి సుధీరా? అనేది అతి త్వరలోనే తెలియనుంది..ప్రస్తుతం సుడిగాలి సుధీర్ ఈటీవీ లో చేస్తున్న ఎంటర్టైన్మెంట్ షోస్ అన్నిటికి గుడ్బై చెప్పి మాటీవీ మరియు జీ టీవీ లో ప్రసారమయ్యే ఎంటర్టైన్మెంట్ షోస్ లో పాల్గొంటున్న సంగతి మన అందరికి తెలిసిందే..ప్రతి ఆదివారం ప్రసారం అయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ షో కి సుధీర్ వ్యాఖ్యాతగా వ్యవహరించేవాడు..కానీ ఇప్పుడు ఆయన స్థానం లో రష్మీ కొనసాగుతుంది.

Anchor Rashmi's wedding took place in secret
Anchor Rashmi

Also Read: SS Rajamouli: రాజమౌళి కెరీర్ లో మధ్యలోనే ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version