Anasuya Bharadwaj : అనసూయ ఘనంగా దీపావళి జరుపుకుంది. తన సెలబ్రేషన్స్ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. అనసూయ నటిగా ఫుల్ బిజీ. ఆమె ఏడాదికి అరడజనుకు పైగా చిత్రాల్లో నటిస్తుంది. 2023లో అనసూయ నటించిన మైఖేల్, రంగమార్తాండ, విమానం, ప్రేమ విమానం, పెదకాపు 1 చిత్రాలు విడుదలయ్యాయి. సందీప్ కిషన్ హీరోగా నటించిన మైఖేల్ నిరాశపరిచింది. రంగమార్తాండ మంచి చిత్రంగా పేరు తెచ్చుకుంది.
రంగమార్తాండ మూవీలో గడసరి కోడలు పాత్రలో అనసూయ మెప్పించింది. ఇక విమానం మూవీలో ఏకంగా వేశ్య పాత్ర చేసి షాక్ ఇచ్చింది. ఇలాంటి బోల్డ్ రోల్ చేయడానికి నటులు వెనకాడతారు. అనసూయ మొహమాటం లేకుండా పాత్రలో ఒదిగిపోయి నటించింది. వెయ్యి రూపాయలు ఇస్తే ఎవడైనా ఓకే అంటూ వేశ్య పాత్రలో మైండ్ బ్లాక్ చేసింది. అలాగే పెదకాపు 1 లో కీలక పాత్ర చేసింది. కథను మలుపు తిప్పే పాత్రలో అనసూయ అద్భుతం చేసింది.
పెదకాపు డిజాస్టర్ కావడంతో ఆమెకు ఇమేజ్ రాలేదు. నెక్స్ట్ అనసూయ పుష్ప 2లో సందడి చేయనుంది. పుష్ప పార్ట్ 1 లో అనసూయ దాక్షాయణి అనే డీగ్లామర్ రోల్ చేసింది. సునీల్ భార్య పాత్రలో అలరించింది. పుష్ప 2లో కూడా ఆమె పాత్ర కీలకం అట. సునీల్, ఫహాద్ ఫాజిల్ తో ఆమెకు మంచి కాంబినేషన్ సన్నివేశాలు ఉన్నాయని అనసూయ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉండే అనసూయ దీపావళి వేడుకల ఫోటోలు షేర్ చేశారు. పండగ వేళ చీర కట్టి సాంప్రదాయంగా సిద్ధమైంది. దీపావళి కాంతుల్లో అనసూయ ముఖం వెలిగిపోతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా పండగ జరుపుకుంది. అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు చెప్పింది. అనసూయ ఫోటోలపై నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో అవి వైరల్ అవుతున్నాయి. ఆమెకు పండగ శుభాకాంక్షలు చెబుతున్నారు. అనసూయ ఫెస్టివ్ లుక్ అద్భుతం అని చెప్పాలి.