Ananya Panday: ‘లైగర్’ భామ ఫాలోయింగ్ చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..!

Ananya Panday: అనన్యపాండే స్టార్ కిడ్ గా బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆమె తండ్రి చుంకీ పాండే బాలీవుడ్లో ఒకప్పుడు బడా హీరో. అతని వారసత్వాన్ని పుణికి పుచ్చుకుంటూ అనన్య పాండే బాలీవుడ్ లోకి అరంగేట్రం చేసింది. రెండేళ్ల క్రితం ‘స్డూడెంట్ ఆఫ్ ది ఇయర్-2’ సినిమాలో హీరోయిన్ గా నటించిన అనన్య పాండే కుర్రకారు అటెన్షన్ మొత్తం తనవైపు తిప్పుకోవడం సక్సస్ సాధించింది. కేవలం గ్లామర్ పరంగానే కాకుండా మంచి నటనను కనబర్చి తొలి సినిమాకే […]

Written By: Raghava Rao Gara, Updated On : January 7, 2022 2:57 pm
Follow us on

Ananya Panday: అనన్యపాండే స్టార్ కిడ్ గా బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆమె తండ్రి చుంకీ పాండే బాలీవుడ్లో ఒకప్పుడు బడా హీరో. అతని వారసత్వాన్ని పుణికి పుచ్చుకుంటూ అనన్య పాండే బాలీవుడ్ లోకి అరంగేట్రం చేసింది. రెండేళ్ల క్రితం ‘స్డూడెంట్ ఆఫ్ ది ఇయర్-2’ సినిమాలో హీరోయిన్ గా నటించిన అనన్య పాండే కుర్రకారు అటెన్షన్ మొత్తం తనవైపు తిప్పుకోవడం సక్సస్ సాధించింది.

Photo Credit : Instagram

కేవలం గ్లామర్ పరంగానే కాకుండా మంచి నటనను కనబర్చి తొలి సినిమాకే అనన్య పాండే బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకుంది. ఈమూవీలో టైగర్ ఫ్రాష్ కి జోడిగా కన్పించి తన చలాకీ తనాన్ని చాటుకున్నఅనన్య సినీప్రియులను మనసులను దోచుకుంది. ఈ మూవీ తర్వాత ‘పతి పత్ని ఔర్ వాహ్’ అనే చిత్రంలో నటించగా ఇది కూడా సూపర్ హిట్ సాధించింది.

అనన్య పాండే నటించిన బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు విజయాలు సాధించడంతో అనతి కాలంలోనే ఆమె బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. అయితే సినిమా కంటే ముందుగానే ఆమెకు సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరుచుకుంది. తన ఇన్ స్ట్రాలో ఫోటో షూట్, గ్లామర్, హాట్ పిక్స్ , వీడియో షేర్స్ చేస్తూ తన ఫాలోవర్స్ ను భారీగా పెంచుకుంటూ పోయింది.

దీంతో ప్రస్తుతం ఆమె ఇన్ స్ట్రా అకౌంట్ ను 20.8మిలియన్ మంది ఫాలో అవుతున్నారు. అంటే దాదాపు రెండు కోట్ల 80లక్షల మంది ఫాలోవర్స్ ఆమె సొంతం అన్నమాట. నిత్యం సోషల్ మీడియాలో అనన్యపాండే యాక్టివ్ ఉంటూ తన ఫ్యాన్స్ ను అలరిస్తూ ఉంటోంది. ఈ ఏడాది ‘అంగ్రేజీ మీడియం’ అనే సినిమాలో ‘కుడి ను నచ్నే డే’ అనే స్పెషల్ సాంగ్ చేసి కుర్రకాళ్లను అటెన్షన్ తనవైపు తిప్పుకుంది.

ప్రస్తుతం అన్యన్య పాండే టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నటిస్తున్న ప్యాన్ ఇండియా మూవీ ‘లైగర్’లో నటిస్తోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ హిందీతోపాటు తెలుగులో ఒకేసారి తెరకెక్కుతోంది. దీంతో అనన్య పాండే నటిస్తున్న తొలి తెలుగు మూవీ ‘లైగర్’గా నిలుస్తోంది. అలాగే ఆమె నటించిన ‘శకున్ బట్ర’ ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ కానుంది.