Samantha: మయోసైటిస్ తో పాటు మరో అరుదైన వ్యాధితో బాధపడుతున్న సమంత… ఆందోళనలో ఫ్యాన్స్!

ఖుషి షూటింగ్ సమయంలోనే బాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడెల్ కూడా సమంత కంప్లీట్ చేసింది. ఇది హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా చేసిన సిటాడెల్ కి రీమేక్ గా వస్తుంది. అనారోగ్యం కారణంగా పోస్ట్ ప్రొడక్షన్ డబ్బింగ్ పనులు మధ్యలోనే ఆగిపోయాయి.

Written By: S Reddy, Updated On : February 1, 2024 4:35 pm
Follow us on

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత కొంత కాలంగా మొయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే మయోసైటిస్ నుంచి కోలుకుంటున్న సమంత మరో కొత్త వ్యాధి తో ఇబ్బంది పడుతుందట. ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సమంత తన హెల్త్ పై పూర్తి కేర్ తీసుకుంటుంది. విదేశాల్లో ట్రీట్మెంట్ తీసుకుని .. రీసెంట్ గా ఇండియా కి తిరిగి వచ్చింది. విజయ్ దేవరకొండతో ఖుషి మూవీ తర్వాత వేరే సినిమాలేవీ సమంత సైన్ చేయలేదు.

ఖుషి షూటింగ్ సమయంలోనే బాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడెల్ కూడా సమంత కంప్లీట్ చేసింది. ఇది హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా చేసిన సిటాడెల్ కి రీమేక్ గా వస్తుంది. అనారోగ్యం కారణంగా పోస్ట్ ప్రొడక్షన్ డబ్బింగ్ పనులు మధ్యలోనే ఆగిపోయాయి. ఇటీవల డబ్బింగ్ చెబుతున్న ఫోటోలు, సిటాడెల్ టీం తో కలిసి ఈ సిరీస్ చూస్తున్న పిక్స్ తన ఇన్ స్టాలో షేర్ చేసింది. ఇక సిటాడెల్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది ఇలా ఉంటే .. మయోసైటిస్ వ్యాధితో పోరాడుతున్న సమంత అమెరికా, భూటాన్ దేశాల్లో ఇమ్యూనిటీ ట్రీట్మెంట్ తీసుకుంది. ప్రస్తుతం ఇంట్లో ఉంటూ విశ్రాంతి తీసుకుంటుంది. అయితే మయోసైటిస్ తో పాటు సమంతకు మరో వ్యాధి కూడా ఉందట. సమంతకు పూలు అంటే అలర్జీ అట. పూలను తాకినా, వాసన చూసినా అసలు పడదట. ఈ విషయాన్ని సమంత స్వయంగా వెల్లడించారు. ఈ న్యూస్ సమంత ఫ్యాన్స్ ని ఆందోళనకు గురి చేస్తుంది.

ప్రస్తుతం సమంత బ్రేక్ లో ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని డిసైడ్ అయింది. ఆమె సైన్ చేసిన ప్రాజెక్ట్స్ నుంచి కూడా తప్పుకుంది. నెక్స్ట్ బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి నటించిన సిటాడెల్ సిరీస్లో కనిపించనుంది. అమెజాన్ ప్రైమ్ లో సిటాడెల్ స్ట్రీమ్ కానుంది. ఆ మధ్య సమంత ఓ హాలీవుడ్ చిత్రానికి సైన్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.