Allu Arjun : చచ్చిపోతాను అని బెదిరించినా నా భార్య నన్ను లెక్క చేయలేదు’ అంటూ ఎమోషనల్ గా మాట్లాడిన అల్లు అర్జున్..అసలు ఏమైందంటే!

గతంలో 'నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా' చిత్రం ప్రొమోషన్స్ లో భాగంగా అల్లు అర్జున్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో స్నేహా రెడ్డి గురించి చేసిన కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. దీనిని అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియా లో మరోసారి గుర్తు చేసుకున్నారు. ఈ ఇంటర్వ్యూ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ 'ఒకరోజు నేను నాపేరు సూర్య..నా ఇల్లు ఇండియా మూవీ షూటింగ్ లో ఉన్నప్పుడు స్నేహా కి కాల్ చేశాను

Written By: Vicky, Updated On : October 16, 2024 4:16 pm

Allu Arjun

Follow us on

Allu Arjun :  మన టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లిస్ట్ లో కచ్చితంగా అల్లు అర్జున్, స్నేహ రెడ్డి ఉంటారు. చూసేందుకు చాలా క్యూట్ గా అనిపించే ఈ జంట ఎంతో అన్యోయంగా, ఒకరికోసం ఒకరు పుట్టినట్టు, ఎంతో మందికి ఆదర్శప్రాయంగా ఉంటారు. సోషల్ మీడియా లో అల్లు అర్జున్ సతీమణికి మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కి మించిన క్రేజ్ ఉంది. ఈమె తన ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేసే ఫోటోలు, వీడియోలకు లక్షల సంఖ్యలో లైక్స్, కామెంట్స్ వస్తుంటాయి. తనకి, తన కుటుంబానికి సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈమె పిల్లలు అల్లు అర్హ, అల్లు అయాన్ ఫోటోలు, వీడియోలు చూసేందుకు చాలా క్యూట్ గా ఉంటాయి. వీళ్లకు సోషల్ మీడియా లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఎప్పటికప్పుడు వాళ్లకు సంబంధించినవి తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో అప్లోడ్ చేస్తూ ఉంటుంది స్నేహా రెడ్డి.

ఇదంతా పక్కన పెడితే గతంలో ‘నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా’ చిత్రం ప్రొమోషన్స్ లో భాగంగా అల్లు అర్జున్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో స్నేహా రెడ్డి గురించి చేసిన కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. దీనిని అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియా లో మరోసారి గుర్తు చేసుకున్నారు. ఈ ఇంటర్వ్యూ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘ఒకరోజు నేను నాపేరు సూర్య..నా ఇల్లు ఇండియా మూవీ షూటింగ్ లో ఉన్నప్పుడు స్నేహా కి కాల్ చేశాను. ఆమెతో సరదాగా మాట్లాడుతూ ఇక్కడ అందరూ నన్ను ఆర్మీ లో జాయిన్ అవ్వమంటున్నారు అనే విషయాన్ని చెప్పాను. స్నేహా క్షణం కూడా ఆలోచించకుండా జాయిన్ అయిపో అని చెప్పింది. ఒకవేళ ఆర్మీ లో చేరి చనిపోతే?, నీ పరిస్థితి ఏమిటి?, పిల్లల పరిస్థితి ఏమిటి అని అడిగాను. చచ్చిపోతే చచ్చిపో, ఇండియా కోసం కదా అని చెప్పింది. ఆరోజు ఫోన్ స్పీకర్ లో పెట్టి మాట్లాడాను, స్నేహా నుండి అలాంటి రియాక్షన్ రావడంతో నాతో పాటు, సెట్స్ లో ఉన్న వాళ్లంతా షాక్ కి గురయ్యారు’ అంటూ చెప్పుకొచ్చాడు అల్లు అర్జున్. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.

ఇది ఇలా ఉండగా ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప 2’ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం కేవలం ఆయన అభిమానులు మాత్రమే కాదు, దేశంలో ఉన్న ప్రతీ సినీ అభిమాని ఎంతో ఆతృతాతగా ఎదురు చూస్తున్నారు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబర్ 5 వ తారీఖున విడుదల చేస్తున్నారు. ముందుగా డిసెంబర్ 6న విడుదల చేయాలని అనుకున్నారు కానీ, కొన్ని ప్రత్యేక పరిస్థితుల కారణం చేత ఒకరోజు ముందుకి జరిగింది. అంటే డిసెంబర్ 5 వ తారీఖున అన్నమాట. విడుదలకు ముందు రోజు రాత్రి ప్రీమియర్ షోస్ కూడా ఉంటాయని అంటున్నారు.