
టాలీవుడ్లో సురేందర్ రెడ్డికి స్టైలీష్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు ఉంది. చిరంజీవితో సినిమాలు చేసేందుకు ఎంతోమంది దర్శకులు క్యూ కడుతుండగా ఆయనే స్వయంగా సురేందర్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చాడు . డైరెక్షన్లో సురేందర్ రెడ్డి ప్రతిభ చూసిన మెగాస్టార్ చిరంజీవి తన డ్రిమ్ ప్రాజెక్టును తెరకెక్కించే బాధ్యతను అప్పగించారు. తొలిసారిగా మెగాస్టార్ చిరంజీవి-దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబోలో ‘సైరా’ చిత్రం తెరకెక్కింది. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవితాధారంగా ‘సైరా నర్సింహారెడ్డి’ చిత్రాన్ని నిర్మించారు. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్లో మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ప్యాన్ ఇండియా మూవీగా మూవీని తీర్చిదిద్దారు.‘సైరా’ తెలుగులో భారీ విజయం సాధించింది. అయితే మిగతా చోట్ల అనుకున్నంత కలెక్షన్లు సాధించలేక నిరాశ పరిచింది. అయినప్పటికీ ఈ సినిమాను సురేందర్ రెడ్డి తీర్చిదిద్దిన తీరుపై ప్రశంసలు దక్కాయి. ‘సైరా’ నర్సింహారెడ్డి పాత్రలో చిరంజీవి పరాకాయ ప్రవేశం చేశారు. ఈ మూవీలో చిరంజీవి సరసన మిల్కి బ్యూటీ తమన్నా, సౌత్ క్వీన్ నయనతార నటించారు. విజయ్ సేతుపతి, జగపతి బాబు ముఖ్యపాత్రల్లో నటించారు.
ఈ మూవీ తర్వాత సురేందర్ రెడ్డి చాలా గ్యాప్ తీసుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. లాక్డౌన్ సమయంలో తన నెక్ట్ మూవీపై ప్లాన్ చేసుకున్నాడు. గతంలో తనకు ‘రేసుగుర్రం’ కథను అందించిన వక్కంతం వంశీతో చర్చించి ఓ పవర్ ఫుల్ స్క్రీప్ట్ పూర్తి చేసినట్లు సమాచారం. ఈ కథను స్టైలీస్ స్టార్ అల్లు అర్జున్ కు విన్పించగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాలీవుడ్ టాక్ విన్పిస్తుంది. ప్రస్తుతం అల్లు అర్జున్-దర్శకుడు సుకుమార్ తో కలిసి ‘పుష్ప’ మూవీ కోసం పని చేస్తున్నారు. ఈ మూవీ పూర్తయ్యాక సురేందర్ రెడ్డి దర్శకత్వంతో తెరకెక్కించబోయే మూవీలో అల్లు అర్జున్ నటిస్తాడని ప్రచారం జరుగుతోంది. గతంలోనూ సురేందర్-అల్లు అర్జున్ కాంబినేషన్లో ‘రేసుగుర్రం’ మూవీ వచ్చింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. అన్నివర్గాల ప్రజలను ‘రేసుగుర్రం’ మూవీ అలరించి సంచలన విజయం సాధించింది. తాజాగా మరోసారి ‘రేసుగుర్రం’ కాంబినేషన్ సెట్టవడంపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.