
మంచి కంటెంట్ తో వస్తే చిన్న సినిమాలను కూడా ఓటీటీ సంస్థలు బాగా ఆదరిస్తోన్న కరోనా రోజులు ఇవి. మరి అలాంటి మంచి కాన్సెప్ట్ తో వస్తోన్న సినిమా ‘బుచ్చినాయుడు కండ్రిగ – తూర్పు వీధి…’. ఈ సినిమా టైటిలే విచిత్రంగా ఉన్నా సినిమాలో మ్యాటర్ బాగానే ఉందట. ఈ సినిమా ట్రైలర్ను హీరోయిన్ సమంత విడుదల చేయడం, ఈ సినిమా ‘ఆహా’లో విడుదలవుతుండటంతో మొత్తానికి ఈ బుడ్డ సినిమా పై బాగానే ఆసక్తి పెరిగింది జనాల్లో. ముఖ్యంగా మనిషి జీవితంలో ముఖ్యమైన అంశాలు జాబ్, చదువు, ప్రేమ, పెళ్లి వంటి ప్రధాన విషయాలతో జనం ఎలాంటి ఒత్తిడిని ఎదుర్కొకుంటున్నారనే థీమ్ ఆధారంగా ఈ సినిమాని ఎమోషనల్ గా తీసినట్లు తెలుస్తోంది.
Also Read: సాంగ్స్ కోసం ‘పుష్ప’ను సిద్ధం చేస్తున్నారు !
మున్నా, దృశిక చందర్ అనే కొత్త హీరోహీరోయిన్లు నటించిన ఈ సినిమాని కృష్ణ పోలూరు అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహించాడు. రొమాంటిక్ సోషల్ థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రం 1994 నుంచి 2004 మధ్య జరిగిన కథ అట. అల్లు అరవింద్ ఈ సినిమాని చూసి, సినిమాలో కంటెంట్ బాగా నచ్చి.. వెంటనే సినిమాని తీసుకున్నారని తెలుస్తోంది. పరువు నేపథ్యంలో నడిచే ఈ ప్రేమకథలో అన్ని ఎమోషన్స్కు పెద్ద పీట వేశారట. ప్రతి కథ మనిషి పుట్టుకతో మొదలవుతుంది. కానీ, నా కథ నా సావుతో మొదలైంది’’ అంటూ మొదలైన ట్రైలర్ కూడా బాగానే ఉంది.
Also Read: తెలుగు స్టార్ పై బాలీవుడ్ హీరోల టెన్షన్ !
మరి ఈ యూత్ ఫుల్ వినూత్న సినిమా ఆడియన్స్ ను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో.. తనను కాదన్న అమ్మాయిపై అబ్బాయి పెంచుకున్న ద్వేషాన్ని మెయిన్ కథగా తీసుకుని.. ఆ అమ్మాయి కోసం పిచ్చోడై మద్యానికి బానిసైన ఆ కుర్రాడి బాధను సినిమాలో కొత్తగా చూపించారట. మొత్తానికి ఈ సినిమాకైతే అల్లు అరవింద్ మంచి ఎమౌంట్ నే సమర్పించుకున్నాడు. మరి అల్లు అరవింద్ జడ్జ్ మెంట్ ఫలిస్తోందో లేక అవుట్ డేటెడ్ అని ప్రూవ్ చేస్తోందో చూడాలి. బన్నీ వాసు లాంటి వారు, ఈ సినిమా బాగాలేదు అని చెప్పినా కూడా, అల్లు అరవింద్ ఒక్కడే ఈ సినిమా మీద నమ్మకంతో సినిమాని కొన్నారట. ఇప్పుడు ఈ సినిమా అల్లు అరవింద్ జడ్జ్ మెంట్ కి పరీక్షలా అయిపోయింది.