Trivikram: బాబాయ్ అబ్బాయిలతో గురూజీ కొత్త సినిమా…

ప్రస్తుతం గురూజీ పని అయిపోయింది అని అందరూ కామెంట్లు చేస్తున్నారు. కానీ ఇప్పుడు త్రివిక్రమ్ అందరికీ షాక్ ఇస్తు ఒక క్రేజీగా కాంబో ను లైన్ లో పెట్టినట్టుగా తెలుస్తుంది.

Written By: Gopi, Updated On : February 6, 2024 10:34 am
Follow us on

Trivikram: ఒక సినిమాలో రైటర్ యొక్క గొప్పతనం ఎంతలా ఉంటుంది అనే విషయాన్ని అప్పట్లో చాలా సినిమాలు ప్రూవ్ చేశాయి. హీరోలతో సంబంధం లేకుండా స్టోరీ బాగుందంటే సూపర్ సక్సెస్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రైటింగ్ స్టైల్ చూస్తే మనకు ఆ విషయం అర్థమవుతుంది. ఆయన కథ మాటలు ఇచ్చిన చాలా సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించాయి అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకుల్ని మెప్పించడంలో ఎప్పుడు ముందు వరుసలో ఉంటుంది.

ఆయన రైటర్ గా చేసిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, మన్మధుడు లాంటి సినిమాలు భారీ సక్సెస్ లను సాధించాయి. ఇక డైరెక్టర్ గా మారిన తర్వాత కూడా చాలా విజయాలను అందుకున్నాడు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలను డైరెక్ట్ చేశాడు. అయితే రీసెంట్ గా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన గుంటూరు కారం సినిమాతో భారీ ఫ్లాప్ ని అందుకోవడంతో, ప్రస్తుతం గురూజీ పని అయిపోయింది అని అందరూ కామెంట్లు చేస్తున్నారు. కానీ ఇప్పుడు త్రివిక్రమ్ అందరికీ షాక్ ఇస్తు ఒక క్రేజీగా కాంబో ను లైన్ లో పెట్టినట్టుగా తెలుస్తుంది. అది ఏంటి అంటే పవన్ కళ్యాణ్ తో ఒక భారీ ప్రాజెక్టుని కన్ఫర్మ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక అందులో ఒక పాత్రలో రామ్ చరణ్ కూడా నటించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఈ న్యూస్ ని తొందర్లోనే అఫిషియల్ గా అనౌన్స్ చేయనున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఈ సినిమాని త్రివిక్రమ్ ఆస్థాన సంస్థ అయిన హారిక అండ్ హాసిని బ్యానర్ మీద చినబాబు నిర్మించబోతున్నట్టు గా కూడా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం గురూజీ ఆ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే గుంటూరు కారం ఫ్లాప్ తర్వాత గురూజీ మరోసారి పవర్ స్టార్ ని నమ్ముకోవడం అనేది కొంతవరకు పవర్ స్టార్ అభిమానులకు కూడా సంతోషకరమైన విషయం అనే చెప్పాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కి అత్తారింటికి దారేది సినిమా తర్వాత ఆ రెంజ్ హిట్ అయితే ఇంతవరకు పడలేదు. ఆ సినిమా వచ్చి దాదాపు 10 సంవత్సరాలు పూర్తవుతుంది. అయినప్పటికీ ఆయనకు అలాంటి ఒక భారీ హిట్ అయితే దక్కలేదు. కాబట్టి మళ్ళీ త్రివిక్రమ్ తో సినిమా చేస్తే భారీ హిట్ అందుతుందని ఆయన అభిమానులు ఆశభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

అయితే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అజ్ఞాతవాసి సినిమా డిజాస్టర్ గా మిగిలినప్పటికీ, త్రివిక్రమ్ మీద పవన్ కళ్యాణ్ అభిమానులకు ఎప్పటినుంచో మంచి అంచనాలైతే ఉన్నాయి. దాని వల్లే వీళ్లిద్దరి కాంబో ఎప్పుడు వర్కౌట్ అవుతుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు పట్టలెక్కుతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాలి…