అక్కినేని షోనా.? బిగ్‌బాస్‌ షోపై నెటిజన్స్ ట్రోల్స్‌

ఇండియన్‌ బిగ్గెస్ట్‌ రియాలిటీ షో బిగ్‌ బాస్‌. ప్రస్తుతం మూడు భాషల్లో సక్సెస్‌ ఫుల్‌గా రన్‌ అవుతోంది. ముఖ్యంగా తెలుగులో ప్రస్తుతం నాలుగో సీజన్‌ నడుస్తోంది. ఇక్కడి ప్రజల నుంచి ఆ షోకు మంచి క్రేజ్‌ లభిస్తోంది. అయితే.. ఇప్పుడు ఈ షోపై నెగెటివ్‌ కామెంట్స్‌ వచ్చి పడుతున్నాయి. ఇప్పటివరకు బిగ్‌బాస్‌ షోలకు నందమూరి తారకరామారావు, నాని, నాగార్జునలు హోస్టుగా వ్యవహరించారు. తాజాగా నాలుగో సీజన్‌కు కూడా నాగర్జుననే హోస్ట్‌గా ఉన్నారు. Also Read: పవన్ సినిమా […]

Written By: NARESH, Updated On : October 27, 2020 3:13 pm
Follow us on


ఇండియన్‌ బిగ్గెస్ట్‌ రియాలిటీ షో బిగ్‌ బాస్‌. ప్రస్తుతం మూడు భాషల్లో సక్సెస్‌ ఫుల్‌గా రన్‌ అవుతోంది. ముఖ్యంగా తెలుగులో ప్రస్తుతం నాలుగో సీజన్‌ నడుస్తోంది. ఇక్కడి ప్రజల నుంచి ఆ షోకు మంచి క్రేజ్‌ లభిస్తోంది. అయితే.. ఇప్పుడు ఈ షోపై నెగెటివ్‌ కామెంట్స్‌ వచ్చి పడుతున్నాయి. ఇప్పటివరకు బిగ్‌బాస్‌ షోలకు నందమూరి తారకరామారావు, నాని, నాగార్జునలు హోస్టుగా వ్యవహరించారు. తాజాగా నాలుగో సీజన్‌కు కూడా నాగర్జుననే హోస్ట్‌గా ఉన్నారు.

Also Read: పవన్ సినిమా వెనుక గురూజీ

అయితే.. ఇటీవల నాగార్జున ఏదో సినిమా షూటింగ్‌ విషయంలో బిగ్‌బాస్‌కు తన కోడలు అయిన సమంతను హోస్ట్‌గా పంపించారు. అంతేకాదు ఆమెతోపాటు నాగార్జున చిన్న కొడుకు అఖిల్‌ కూడా వచ్చి సందడి చేశాడు. ఇదే ఇప్పుడు వివాదస్పదమైంది. బిగ్‌బాస్‌ షో కాస్త అక్కినేని ఫ్యామిలీ షో అయిందంటూ ట్రోల్స్‌ అవుతున్నాయి. ఏ ట్రోల్‌ వచ్చినా నాగార్జున అంత సాధారణంగా తీసుకోడు. అది ఇప్పటికే ఒకసారి రుజువు కూడా అయింది.

నందమూరి ఫ్యామిలీ ఎంత పెద్దదైనా కూడా ఒక్క సినిమాకు తప్పితే మరోసారి బిగ్‌బాస్‌ను వాడుకోలేదు. అన్నయ్య కళ్యాణ్ రామ్ నిర్మించిన జై లవకుశ కూడా తన సినిమానే కాబట్టి తారక్ చాలా ఈజీగా వాడేసుకున్నాడు. ఇక నాని మాత్రం బిగ్ బాస్‌ను అంతగా వాడుకోలేదనే చెప్పాలి. అయితే నాగార్జున మాత్రం షోలోకి తన ఫ్యామిలీ మొత్తాన్ని దించేస్తున్నాడు అంటూ ట్రోలింగ్స్ వస్తున్నాయి. ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఎంట్రీలు బాగానే ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం మీమ్స్ కు  ఈజీగా దొరికిపోయినట్లు తెలుస్తోంది. పైగా సమంత మామ టీవీ అనే డైలాగ్ పై కూడా ట్రోలింగ్ నడుస్తోంది. సోషల్ మీడియాలో ఓ వర్గం నెటిజన్లు కూడా అక్కినేని షో అంటూ కామెంట్స్ చేస్తుండడం హాట్ టాపిక్‌గా మారింది.

Also Read: నమ్మక ద్రోహం చేసిన మాస్టర్

మరోవైపు ఈ ట్రోల్స్‌పై నాగార్జున కూడా ఎంతవరకు స్పందిస్తారో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే గంగవ్వ విషయంలో అది రుజువు చేశారు. నాగార్జున వయసులో పెద్ద అయినప్పటికీ గంగవ్వను అవ్వ అని పిలవడంతో ట్రోలింగ్‌ నడిచింది. దీంతో నాగ్‌ మరుసటి రోజే మళ్లీ ఆమెను చెల్లెమ్మా అంటూ సంభోదించాడు. ఇప్పుడు ఈ ట్రోల్స్‌ నుంచి ఎలా బయటపడుతాడో ఆసక్తిగా మారింది.