Nagarjuna Car: బిగ్ బ్రేకింగ్ : వరదల్లో చిక్కుకున్న అక్కినేని నాగార్జున కారు..ఆందోళనలో ఫ్యాన్స్.. అసలు ఏమైందంటే!

కొంతసేపు అలజడిగా ఆ ప్రాంగణం మొత్తం మారగా, వెంటనే కళ్యాణ్ జ్యువెలర్స్ నిర్వాహకులు అక్కడికి చేరుకొని నాగార్జున ని మరో మార్గం ద్వారా అనంతపురం కి తీసుకెళ్లారు. నాగార్జున ని చూసేందుకు వేలాదిగా అభిమానులు తరలి రాగా, వాళ్ళ సమక్ష్యంలోనే ఆయన కళ్యాణ్ జ్యువెలర్స్ కొత్త బ్రాంచ్ ని ప్రారంభించాడు.

Written By: Vicky, Updated On : October 22, 2024 4:57 pm

Nagarjuna Car

Follow us on

Nagarjuna Car: ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున వరదల్లో చిక్కుకున్నాడు అనే వార్త ఆయన అభిమానులను తీవ్రమైన ఆందోళనకు గురి చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే నాగార్జున కళ్యాణ్ జ్యువెలర్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇది వరకు ఆయన ఎన్నో యాడ్స్ లో కనిపించాడు. రీసెంట్ గానే ఆయన మెగాస్టార్ చిరంజీవి తో కలిసి కళ్యాణ్ జ్యువెలర్స్ అధినేత నిర్వహించిన దసరా సంబరాల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇదంతా పక్కన పెడితే నేడు అనంతపురం లో కళ్యాణ్ జ్యువెలర్స్ కొత్త బ్రాంచ్ ని ప్రారంభించారు. దీనికి ముఖ్య అతిథిగా నాగార్జున ని ఆహ్వానించగా, ఆయన నేడు ఉదయం హైదరాబాద్ నుండి బయలుదేరి పుట్టపర్తి కి చేరుకున్నాడు. అక్కడి నుండి అనంతపురం కి రోడ్డు మార్గం ద్వారా వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది.

కొంతసేపు అలజడిగా ఆ ప్రాంగణం మొత్తం మారగా, వెంటనే కళ్యాణ్ జ్యువెలర్స్ నిర్వాహకులు అక్కడికి చేరుకొని నాగార్జున ని మరో మార్గం ద్వారా అనంతపురం కి తీసుకెళ్లారు. నాగార్జున ని చూసేందుకు వేలాదిగా అభిమానులు తరలి రాగా, వాళ్ళ సమక్ష్యంలోనే ఆయన కళ్యాణ్ జ్యువెలర్స్ కొత్త బ్రాంచ్ ని ప్రారంభించాడు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇది ఇలా ఉండగా నాగార్జున ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8 కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఒకపక్క ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూనే మరో పక్క వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ గా గడుపుతున్నాడు. సూపర్ స్టార్ రజినీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కూలీ అనే సినిమాలో విలన్ గా నటిస్తున్న నాగార్జున, తెలుగు లో శేఖర్ కమ్ముల దర్శకత్వం లో ‘కుభేర’ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాగార్జున తో పాటు తమిళ హీరో ధనుష్ కూడా నటిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఈ చిత్రం లో రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. లవ్ స్టోరీ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రం పై అంచనాలు భారీ గా ఉన్నాయ్. మరో పక్క కూలీ చిత్రం లో నాగార్జున కి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియా లో లీకై తెగ వైరల్ గా మారిన సంగతి అందరికీ తెలిసిందే. విక్రమ్ సినిమాలో ‘రోలెక్స్’ పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో, కూలీ చిత్రంలో నాగార్జున పాత్ర అంతకు మించి పవర్ ఫుల్ గా ఉంటుంది. ఇంత వయొలెంట్ గా తమ అభిమాన హీరో నాగార్జున ని చూసి, అభిమానులు ఎంతో మురిసిపోతున్నారు. సరైన డైరెక్టర్ చేతిలో పడితే మా నాగార్జున ఈ రేంజ్ పెర్ఫార్మన్స్ ఇస్తాడని సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు.