ఆదిపురుష్: రాముడిగా ప్రభాస్.. రావణుడిగా ఎవరంటే?

‘బాహుబలి’తో ప్రభాస్ టాలీవుడ్ రేంజ్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయారు. ‘బాహుబలి’ సిరీస్ లు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన అన్నిచోట్ల భారీ కలెక్షన్లు రాబట్టడంతో ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా వరల్డ్ వైడ్ గా పాపులర్ అయ్యాడు. ఈ మూవీ తర్వాత ప్రభాస్ వరుసబెట్టి పాన్ ఇండియా మూవీలే చేస్తున్నాడు. ‘బాహుబలి’ తర్వాత వచ్చిన సాహో కూడా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కి మంచి విజయం సాధించింది. ఇక ప్రభాస్ రాముడిగా నటించనున్న ‘ఆదిపురుష్’ ఇండస్ట్రీలో […]

Written By: NARESH, Updated On : September 3, 2020 9:14 am
Follow us on

‘బాహుబలి’తో ప్రభాస్ టాలీవుడ్ రేంజ్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయారు. ‘బాహుబలి’ సిరీస్ లు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన అన్నిచోట్ల భారీ కలెక్షన్లు రాబట్టడంతో ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా వరల్డ్ వైడ్ గా పాపులర్ అయ్యాడు. ఈ మూవీ తర్వాత ప్రభాస్ వరుసబెట్టి పాన్ ఇండియా మూవీలే చేస్తున్నాడు. ‘బాహుబలి’ తర్వాత వచ్చిన సాహో కూడా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కి మంచి విజయం సాధించింది. ఇక ప్రభాస్ రాముడిగా నటించనున్న ‘ఆదిపురుష్’ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది.

ప్రభాస్ ప్రస్తుతం ‘రాధే శ్యామ్’ మూవీలో నటిస్తున్నాడు. ఇందులో ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది. ఈ మూవీ చేస్తుండగానే ప్రభాస్ ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ తో ఓ మూవీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వైజయంతి బ్యానర్ 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అత్యంత భారీ బడ్జెట్లో ఈ మూవీని నిర్మించబోతున్నారు. సైంటిఫిక్ కథాంశంతో ఈ మూవీ రాబోతుందని టాక్ విన్పిస్తోంది.

నాగ్ అశ్విన్ మూవీ ఇంకా పట్టాలెక్కకముందే ప్రభాస్ మరో మూవీ కమిట్ అయ్యాడు. బాలీవుడ్ మూవీ మేకర్స్ కలిసి ఓ మూవీ చేయనున్నట్లు ఆగస్టు 18నే ప్రకటించాడు. ‘తానాజీ: ది అన్‌సంగ్ వారియర్’ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘ఆదిపురుష్’ టైటిల్ కూడా అనౌన్స్ చేశారు. ప్రభాస్ ఈ మూవీలో రాముడిగా కన్పించనుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

అయితే డార్లింగ్ ప్రభాస్ నిన్న సాయంత్రం తన ఇన్ స్ట్రాగ్రామ్ ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర పోస్టు చేశాడు. ‘7వేల సంవత్సరాల క్రితం ప్రపంచంలోనే అత్యంత తెలివైన రాక్షసుడు ఉండేవాడు..! అని ట్వీట్ చేశాడు. రేపు ఉదయం 7.11గంటలకు ఒక సర్ ప్రైజ్ అభిమానులకు ఓ సర్ ప్రైజ్ ఉంటుందని చెప్పడంతో అభిమానులంతా అత్రుతగా ఎదురుచూశారు. ఇక ప్రభాస్ చెప్పినట్లుగానే సర్ ప్రైజ్ నేటి ఉదయమే రివీల్ చేశాడు.

ప్రభాస్ చెప్పినట్లు ఆ తెలివైన రాక్షసుడి పాత్రలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ నటించబోతున్నట్లు తెల్సిపోయింది. ఆదిపురుష్ లో ప్రభాస్ రాముడిగా కన్పించబోతుండగా సైల్ అలీఖాన్ రావణుడిగా నటించనుండటం ఆసక్తిని రేపుతోంది. దర్శకుడు ఓం రౌత్ తో తెరకెక్కించిన ‘తానాజీ’లో కూడా సైఫ్ విలన్ పాత్రలో కన్పించి మెప్పించిన సంగతి తెల్సిందే. తాజాగా మరోసారి ‘ఆదిపురుష్’లో విలన్ పాత్రలో నటించే ఛాన్స్ దక్కించుకున్నాడు.

తనకు ప్రత్యర్థిగా సైఫ్ నటించస్తుండటంపై ప్రభాస్ స్పందిస్తూ ‘సైఫ్ అలీఖాన్ సర్ తో కలిసి పని చేయబోతున్నందుకు సంతోషంగా ఉందని’ పేర్కొన్నాడు. ఏదిఏమైనా ‘ఆదిపురుష్’ ‘సినిమా ప్రారంభానికి ముందే ఇండస్ట్రీలో సంచనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది.