Bigg Boss Telugu 8 : దుమ్ములేపేసిన యష్మీ..ఈ దెబ్బతో సోనియా అస్సాం ట్రైన్ ఎక్కినట్టే..ఇలాంటి పాయింట్స్ ఎవ్వరు మాట్లాడుండరు!

హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ సోనియా జోలికి వెళ్లాలంటే భయపడేవారు. ఎందుకంటే ఎక్కడ నోరు జారుతుందో, మనం ఎక్కడ బాధపడాల్సి వస్తుందో అని కంటెస్టెంట్స్ భయం. ఇదే స్ట్రాటజీ తో ఆడుకుంటూ వస్తున్నని యష్మీ ఈ వారం క్లీన్ బౌల్డ్ చేసింది అనొచ్చు.

Written By: Vicky, Updated On : September 25, 2024 8:41 am

Bigg Boss Telugu 8

Follow us on

Bigg Boss Telugu 8 :  ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో మొదటి ఎపిసోడ్ నుండి కంటెస్టెంట్స్ ని డామినేట్ చేసే విషయం లో సోనియా నెంబర్ 1 అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. తనకు తానుగా ఆడ పులి అని ట్యాగ్ ఇచ్చుకున్న సోనియా, తన మీద నామినేషన్స్ వేయడానికి వచ్చిన వారిపై ఇష్టమొచ్చినట్టు నోరు జారుతూ వాళ్ళని ఏడిపించిన సందర్భాలు చాలా ఉన్నాయి. అమానవీయంగా ఈమె మాట్లాడిన మాటలు చూస్తే అసలు ఇలాంటి అమ్మాయిలు కూడా ఉంటారా అని అనిపించక తప్పదు. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఈమె జోలికి వెళ్లాలంటే భయపడేవారు. ఎందుకంటే ఎక్కడ నోరు జారుతుందో, మనం ఎక్కడ బాధపడాల్సి వస్తుందో అని కంటెస్టెంట్స్ భయం. ఇదే స్ట్రాటజీ తో ఆడుకుంటూ వస్తున్నని యష్మీ ఈ వారం క్లీన్ బౌల్డ్ చేసింది అనొచ్చు.

ముందుగా నామినేషన్స్ ఎపిసోడ్ లో తాను మనసులో ఏదైతే అనుకుందో,నిర్మొహమాటంగా ఆమె ముందు బలమైన గొంతుతో బయటపెట్టి ఆమె ఆట తీరుని జనాలకు తెలిసేలా చేసింది. నీకు ఫిజికల్ గేమ్స్ ఆడే ధైర్యం లేక నిఖిల్ , పృథ్వీ ని అవతల వాళ్ళ వైపుకు వదులుతున్నావ్, వాళ్ళని నీ ఆయుధాలు లాగా వాడుకుంటున్నావు అని చెప్తుంది. దీనికి సోనియా ‘నేను ఫిజికల్ గా ఆడలేదని ఎలా చెప్తున్నావు..?, నిన్ను ప్రేరణ ని ఆపింది ఎవరో కనపడలేదా?, బహుశా నువ్వు నిఖిల్, పృథ్వీ ని చూస్తూ ఉంటావు కాబట్టి నా మీద నీ ద్రుష్టి పడుండకపోయుండొచ్చు’ అని అంటుంది. దీనికి యష్మీ చాలా బాధపడుతుంది. నామినేషన్స్ అయ్యాక నిఖిల్,పృథ్వీ తో యష్మీ మాట్లాడుతూ ‘నేను మిమ్మల్ని ఆ ఉద్దేశ్యంతో చూడలేదు..ఆమె నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తుంది’ అని వివరణ ఇస్తున్న సమయంలో సోనియా అక్కడికి మళ్ళీ వస్తుంది. అప్పుడు యష్మీ తో మాట్లాడుతూ ‘నువ్వు మాత్రం నాకు నిఖిల్, పృథ్వీ తో లింక్ పెట్టి మాట్లాడొచ్చు, నేను మాట్లాడితే తప్పు అయ్యిందా’ అని అంటుంది. అప్పుడు యష్మీ మాట్లాడుతూ ‘నేను ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాను..నీలాగా వక్రంగా ఆలోచించలేదు’ అని అంటుంది.

అలా వీళ్లిద్దరి మధ్య గొడవ చాలా సేపటి వరకు కొనసాగుతూ ఉంటుంది. ఒకానొక సమయం లో యష్మీ మాట్లాడుతూ ‘నువ్వు నిఖిల్, పృథ్వీ ని తమ్ముళ్లు అంటావ్, కానీ వాళ్ళ మీద ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తుంటావ్..దీనిని ఎవరైనా తప్పుగా అర్థం చేసుకోకుండా ఎలా ఉంటారు’ అని అంటుంది. సోషల్ మీడియా లో ప్రేక్షకులు సోనియా గురించి ఏవైతే మాట్లాడుకున్నారో, వాటిని కళ్ళతో చూసి యష్మీ చెప్పినట్టుగా అనిపించింది. గేమ్ ని ఆమె ఇంత ఫోకస్ గా చూస్తుందా అని సోనియా కూడా ఆశ్చర్యపోయింది. అలా ఆశ్చర్యపోతూ కూడా ఆమె ఒక మాట యష్మీ మీదకు వదిలేసింది. ఆమె మాట్లాడుతూ ‘నేను పృథ్వీ మీద ఎక్కడెక్కడ చేతులు వేసి మాట్లాడుతున్నానో కూడా గమనించే నువ్వు, నేను ఫిజికల్ గా ఆడిన ఆటను గమనించలేదు, అంటే నీ ఫోకస్ మొత్తం వాళ్ళిద్దరి మీదనే ఉంది’ అని చెప్పుకొస్తుంది. ఆ తర్వాత యష్మీ సోనియా మాటలకు ఏడ్చేస్తుంది.