Karuppu advance bookings: గత 12 ఏళ్లుగా బాక్స్ ఆఫీస్ వద్ద సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేక ఇబ్బంది పడుతున్న బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఎవరైనా ఉన్నారా అంటే, అది సూర్య మాత్రమే. ఈమధ్య కాలం లో అయితే ఆయనకు వరుసగా మూడు ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ పడ్డాయి. ఇక సూర్య సినిమాలను జనాలు చూడరేమో అని అందరూ ఫిక్స్ అయిపోయిన ఈ సందర్భంలో , నేడు ఆయన నుండి విడుదలైన ‘కరుప్పు’ చిత్రానికి మొదటి ఆట నుండే అద్భుతమైన పాజిటివ్ టాక్ వచ్చింది. సూర్య చిత్రానికి ఇలా పాజిటివ్ టాక్ వచ్చిన చివరి చిత్రం ‘సింగం 2’. అప్పటి నుండి ఇప్పటి వరకు సూర్య కి పాజిటివ్ టాక్ వచ్చిన సినిమా ఒక్కటి కూడా లేకపోవడం గమనార్హం. అయితే ఈ చిత్రం నిన్ననే విడుదల అవ్వాల్సింది , కొన్ని అనుకోని కారణాల వల్ల నేటికీ వాయిదా పడింది.
ప్రతీ సినిమాకు బుక్ మై షో లో అడ్వాన్స్ బుకింగ్స్ జరిగే సంగతి తెలిసిందే. కానీ ఈ చిత్రం వాయిదా పడడం వల్ల , అడ్వాన్స్ బుకింగ్స్ జరగలేదు కేవలం 70 వేల టికెట్స్ మాత్రమే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా అమ్ముడుపోయాయి. దాని ప్రభావం నేడు చాలా బలంగా పడింది , పైగా పాజిటివ్ టాక్ కూడా రావడం తో సెన్సేషనల్ కరెంటు బుకింగ్స్ జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ లో గంటకు 43 వేల టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. ఇది సాధారణమైన విషయం కాదు. తమిళనాడు లో ఇప్పటి వరకు ఈ స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ సూపర్ స్టార్ రజినీకాంత్, విజయ్ చిత్రాలకు మాత్రమే జరిగాయి, వాళ్ళిద్దరి తర్వాతి స్థానంలో ఇప్పుడు సూర్య నిలిచాడు. ఇది ఆయన అభిమానులకు మంచి బూస్ట్ ఇచ్చే సందర్భం అనే చెప్పొచ్చు.
కోలీవుడ్ లో నిన్న మొన్నటి వరకు సూర్య కి ప్రదీప్ రంగనాథన్ , శివ కార్తికేయన్ వంటి హీరోల రేంజ్ లో కూడా ఓపెనింగ్స్ వచ్చేవి కాదు , క్లోజింగ్ వసూళ్లు అయితే చాలా దారుణంగా ఉండేవి , కానీ ఇప్పుడు ఈ ‘కరుప్పు’ అడ్వాన్స్ బుకింగ్స్ ని చూస్తుంటే , ఈ చిత్రానికి మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 30 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు కచ్చితంగా వచ్చేలాగానే అనిపిస్తోంది. మరో పక్క ఈ చిత్రం తెలుగు లో ‘వీరభధ్రుడు ‘ అనే టైటిల్ తో విడుదలైంది. ఇక్కడ పెద్దగా ఓపెనింగ్స్ ఉండవేమో అని అంతా అనుకున్నారు కానీ , ఇక్కడ కూడా ఈ చిత్రానికి డీసెంట్ స్థాయి ఓపెనింగ్స్ దక్కాయి , బుక్ మై షో యాప్ లో తెలుగు వెర్షన్ కి గంటకు 4 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి.
