టాలీవుడ్ నేటి ఎక్స్ క్లూజివ్ అప్ డేట్స్ కి వస్తే.. మెగాస్టార్ చిరంజీవి (MegaStar Chiranjeevi) ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో మంచి క్రేజ్ ఉన్న సినిమా “లూసిఫర్” రీమేక్. ‘గాడ్ ఫాదర్’ (God Father) అనే పవర్ ఫుల్ టైటిల్ ను పెట్టారు ఈ రీమేక్ కు. అయితే, ఈ సినిమాలో మలయాళ స్టార్ బిజూ మీనన్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. త్వరలోనే అధికారిక అప్ డేట్ రానుంది.
అన్నట్టు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్లు అంతా కలిసి ఒక సినిమాని నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇంతకీ ఎవరు ఆ దర్శకులు అంటే.. క్లాసిక్ డైరెక్టర్ మణిరత్నం, భారీ సినిమాల దర్శకుడు శంకర్, మురుగదాస్, గౌతమ్ మీనన్, వెట్రిమారన్, మిస్కిన్.. ఇలా అందరూ కలసి త్వరలోనే ఓ సినిమా నిర్మాణాన్ని చేపట్టబోతున్నారు. ఈ సినిమా కోసం వీళ్ళు అందరూ కలిసి ‘రైన్ ఆన్ ఫిలిమ్స్’ అనే బ్యానర్ ను కూడా స్థాపించారు.
ఇక అక్కినేని సమంత హిందీ చిత్ర సీమ పై దృష్టి పెడుతుంది. ఈ విషయం పై సమంత మాట్లాడుతూ ‘భారీ హిందీ సినిమాలు చేయడానికి నేను ఎప్పుడూ రెడీనే. కానీ, నేను చేయాలంటే.. కొత్త పాత్రలతో కూడిన కథలు రావాలి. నేను ఆ పాత్ర చేయాలి అని, నాకు బలంగా అనిపించాలి. అప్పుడు మాత్రమే నాకు కూడా నటించాలనే ఆసక్తి ఉంటుంది. మరి అలాంటి కథలు గాని వస్తే.. కచ్చితంగా చేస్తాను’ అని తెలిపింది.
నాని ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి త్వరలోనే రిలీజ్ డేట్ రాబోతుంది. వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాకి, మిక్కీ జె.మేయర్ సంగీతాన్ని సమకూర్చాడు.
సందీప్ కిషన్ హీరోగా వస్తోన్న ‘గల్లీ రౌడీ’ సినిమా వచ్చే నెల 3వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు ముందుగా ప్రకటించినా ఇప్పుడు ఆ డేట్ మారింది. ఇక ఈ సినిమాను వచ్చే నెలలో 14న రిలీజ్ చేయనున్నారు. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తారు.