ఈ మధ్య కాలంలో అధిక బరువు సమస్య చాలామందిని వేధిస్తోంది. ముఖ్యంగా మహిళలు తాము డెలివరీ తర్వాత బరువు పెరిగామని అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు. అధిక బరువుతో బాధ పడే వాళ్లను భవిష్యత్తులో అనేక ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు ఉంటాయి. దీంతో వైద్య నిపుణులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రెగ్నెన్సీ తర్వాత బరువు పెరగకుండా జాగ్రత్త పడవచ్చని తెలుపుతున్నారు.
డెలివరీ తరువాత మహిళలు వ్యాయామం చేయడం సాధ్యం కాదు. ప్రసవం తర్వాత మహిళలు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు చెబుతారు కాబట్టి అదే సమయంలో శరీరంపై ఒత్తిడి పడకూడదు కాబట్టి మహిళలు వ్యాయామం చేయాకూడదు. అయితే నెలల సమయం విశ్రాంతి తీసుకోవడం వల్ల డెలివరీ తర్వాత మహిళలు ఖచ్చితంగా బరువు పెరుగుతారు. అయితే కొందరు మహిళలు బరువు పెరగకూడదని భావించి తక్కువ మొత్తంలో ఆహారం తీసుకుంటారు.
తక్కువ మొత్తం ఆహారం తీసుకుంటే బరువు తగ్గుతామనే మాట నిజం కాదు. అదే సమయంలో ఆహారం తక్కువగా తీసుకుంటే జీవక్రియ మందగించి బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి. భోజనాన్ని మానేయకుండా సరైన పోషకాలు ఉన్న ఆహారాని తీసుకోవడం వల్ల బరువును సులభంగా అదుపులో ఉంచుకోవడం సాధ్యమవుతుంది. డైటీషియన్ సూచనల మేరకు ఆహారం తీసుకుంటే బరువు పెరిగే అవకాశాలు ఉండవు.
ప్రసవం తరువాత వేయించిన ఆహారాన్ని, షుగర్ ను డైట్ జాబితా నుంచి పూర్తిగా తొలగించాలి. తగినంత నిద్ర ఉండే విధంగా జాగ్రత్త పడాలి. సరిగ్గా నిద్రపోనివాళ్లే ఆరోగ్య సమస్యల బారిన పడతారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రసవం తర్వాత కూరగాయలు, ఆరోగ్యకరమైన ధాన్యాలను ఎక్కువగా తీసుకుంటే మంచిది. ఫైబర్ ఉన్న ఆహారాలు జీర్ణక్రియ నెమ్మదించేలా చేస్తాయి కాబట్టి ఫైబర్ ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ద్వారా బరువు పెరగకుండా జాగ్రత్త పడవచ్చు.
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read More