Homeఎడ్యుకేషన్PSB Recruitment: పంజాబ్‌ అండ్‌ సింద్‌ బ్యాంకులో ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో?

PSB Recruitment: పంజాబ్‌ అండ్‌ సింద్‌ బ్యాంకులో ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో?

PSB Recruitment: భారత ప్రభుత్వ రంగ బ్యాంకులలో ఒకటైన పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. ఐటీ, రిస్క్‌ మేనేజర్‌ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి తాజాగా జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 40 ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం. మొత్తం 40 ఉద్యోగ ఖాళీలలో 37 ఐటీ మేనేజర్ల ఉద్యోగ ఖాళీలు ఉండగా 3 రిస్క్ మేనేజర్ల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.

కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ చదివిన వాళ్లు రిస్క్ మేనేజర్ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే కనీసం మూడు సంవత్సరాల అనుభవం ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీల కోసందరఖాస్తు చేసుకోవాలి. ఐటీ మేనేజర్ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే వాళ్లు బీఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్‌ పాసై ఉండాలి. కనీసం 4 సంవత్సరాల అనుభవం కచ్చితంగా ఉండాలి.

25 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య అనుభవం ఉన్న వ్యక్తులు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు. ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ విధానంలో అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. డిప్యూటీ జనరల్‌ మేనేజర్; పంజాబ్‌ సింద్‌ బ్యాంక్‌, ఫిఫ్త్‌ ఫ్లోర్‌, బ్యాంక్‌ బౌజ్‌, న్యూఢిల్లీ-110008 అడ్రస్ కు దరఖాస్తులను పంపించడం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

నవంబర్ 19వ తేదీన ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా నవంబర్ 28వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకునే ఛాన్స్ ఉంటుందని చెప్పవచ్చు. https://punjabandsindbank.co.in/ వెబ్ సైట్ లో ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
RELATED ARTICLES

Most Popular