ఆయుష్‌ మంత్రిత్వశాఖలో ఉద్యోగ ఖాళీలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?

ఆయుష్‌ మంత్రిత్వశాఖ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల కొరకు ఈ సంస్థ నుంచి తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. కాంట్రాక్ట్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది. నిరుద్యోగులు నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. మొత్తం 5 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ 5 ఉద్యోగ ఖాళీలలో మూడు ఉద్యోగ […]

Written By: Kusuma Aggunna, Updated On : November 15, 2021 9:24 am
Follow us on

ఆయుష్‌ మంత్రిత్వశాఖ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల కొరకు ఈ సంస్థ నుంచి తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. కాంట్రాక్ట్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది. నిరుద్యోగులు నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. మొత్తం 5 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

ఈ 5 ఉద్యోగ ఖాళీలలో మూడు ఉద్యోగ ఖాళీలు డేటా ఎనలిస్ట్ ఉద్యోగ ఖాళీలు కాగా డేటా ఎంట్రీ ఆపరేటర్‌ ఉద్యోగ ఖాళీలు 2 ఉన్నాయి. సంబంధిత సబ్జెక్టులలో గ్రాడ్యుయేషన్‌తో పాటు ఎంబీఏలో పాసై అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కంప్యూటర్ నాలెడ్జ్ తో పాటు టైపింగ్ స్కిల్స్ ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని చెప్పవచ్చు.

ఆఫ్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ విభాగంలో దరఖాస్తు చేసుకోవచ్చు. డ్రగ్‌ పాలసీ సెక్షన్‌, మినిస్టరీ ఆఫ్‌ ఆయుష్‌, ఎన్‌బీసీసీ, ఆఫీస్‌ బ్లాక్‌ 3, న్యూఢిల్లీ, 110023 అడ్రస్‌కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. ప్రోగ్రాం మేనేజర్ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 50,000 రూపాయల వేతనం లభిస్తుంది.

డేటా అనలిస్ట్‌/డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 20,000 రూపాయల వరకు వేతనం లభించే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. నవంబర్ 25వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ కాగా నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భారీస్థాయిలో ప్రయోజనం చేకూరనుంది.