గత కొన్ని రోజుల నుంచి నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా వరుస నోటిఫికేషన్లు వెలువడుతుండగా ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సైతం నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 15 ఉద్యోగాల కోసం ఈసీఐఎల్ నుంచి నోటిఫికేషన్ వెలువడగా ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి అర్హత, అనుభవాన్ని బట్టి రెండు లక్షల రూపాయలు వేతనంగా లభిస్తుంది. భారీ మొత్తంగా వేతనం పొందే ఛాన్స్ ఉండటంతో ఈ ఉద్యోగాలకు పోటీ ఎక్కువగానే ఉంటుంది.
Also Read: నిరుద్యోగులకు కాగ్నిజెంట్ శుభవార్త.. ఏకంగా 23,000 ఉద్యోగాలు..?
http://www.ecil.co.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ ఉద్యోగానికి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా డిసెంబర్ 31, 2020 దరఖాస్తు ప్రక్రియకు చివరి తేదీగా ఉంది. ఈసీఐఎల్ ఈ నోటిఫికేషన్ ద్వారా సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, సీనియర్ మేనేజర్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు ఆన్ లైన్ లో, ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read: ఇంజనీరింగ్ విద్యార్థులకు శుభవార్త.. రూ.42,500 వేతనంతో ఉద్యోగాలు..?
ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ నెల 31వ తేదీలోగా వెబ్ లైట్ లో ఉన్న కంపెనీ అడ్రస్ కు దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది. ఉద్యోగాన్ని బట్టి ఉద్యోగ అర్హత, అనుభవంలలో మార్పులు ఉంటాయి. ఇప్పటికే విడుదలైన నోటిఫికేషన్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్, పీజీ, సీఏ, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
మరిన్ని: విద్య / ఉద్యోగాలు కోసం
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఫీజు 500 రూపాయలుగా ఉంది. ఈసీఐఎల్ కేంద్ర ప్రభుత్వంలోని అటామిక్ ఎనర్జీ విభాగానికి చెందిన కంపెనీ అనే సంగతి తెలిసిందే. అర్హత, అనుభవం ఆధారంగా లభించే వేతనంలో మార్పులు ఉంటాయి.