Homeఎడ్యుకేషన్బీటెక్ పాసైన వాళ్లకు శుభవార్త.. నెలకు రూ.లక్ష వేతనంతో జాబ్స్!

బీటెక్ పాసైన వాళ్లకు శుభవార్త.. నెలకు రూ.లక్ష వేతనంతో జాబ్స్!

సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. ఇంజనీరింగ్ ఆఫీసర్ గ్రేడ్ -1 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. బీటెక్ పాసై అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అని చెప్పవచ్చు. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. మొత్తం 14 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది.

మొత్తం 14 ఉద్యోగ ఖాళీలలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉద్యోగ ఖాళీలు 8 ఉండగా మెకానికల్ ఇంజనీరింగ్ ఉద్యోగ ఖాళీలు 2, కెమికల్ ఇంజనీరింగ్ ఉద్యోగ ఖాళీలు 2, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఉద్యోగ ఖాళీలు 2 ఉన్నాయి. 2022 సంవత్సరం ఫిబ్రవరి 20వ తేదీనాటికి 30 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు అని చెప్పవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు 44,900 రూపాయల నుంచి 1,42,400 రూపాయల వరకు వేతనంగా లభించనుంది.

2020, 2021 సంవత్సరాలలో వాలిడ్ గేట్ స్కోర్ తో పాటు సంబంధిత స్పెషలైజేషన్ లో బీఈ, బీటెక్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు అని చెప్పవచ్చు. అకడమిక్ మెరిట్, గేట్ స్కోర్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుందని సమాచారం అందుతోంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. 2022 సంవత్సరం జనవరి 31వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది.

https://cpri.res.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవడం సాధ్యమవుతుందని చెప్పవచ్చు. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరనుంది.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Exit mobile version