Homeక్రైమ్‌Wife Poisons Sambar: ప్రియుడి మైకంలో.. సాంబార్ లో విషం పెట్టి భర్తను లేపేసింది..

Wife Poisons Sambar: ప్రియుడి మైకంలో.. సాంబార్ లో విషం పెట్టి భర్తను లేపేసింది..

Wife Poisons Sambar: ప్రాంతాలు మారుతున్నాయి. జరిగే సంఘటనలు మారుతున్నాయి.. జరుగుతున్న దారుణాలలో మాత్రం భర్తల జీవితాలు కడతేరిపోతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఎన్నో సంఘటనలు జరిగినప్పటికీ మార్పు రావడం లేదు. న్యాయస్థానాలు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. పోలీసులు అధునాతన పద్ధతులను ఉపయోగించి పట్టుకుంటున్నప్పటికీ కొంతమంది భార్యలు మారడం లేదు.

ఢిల్లీలో ప్రియుడి మైకంలో భార్య భర్తను చంపిన ఘటన మర్చిపోకముందే మరో దారుణం చోటుచేసుకుంది.. సాంబార్ లో విషం కలిపి భర్తను లేపేసింది ఓ భార్య. ఈ దారుణం తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. తమిళనాడు రాష్ట్రంలోని ధర్మపురి జిల్లా ఆరూరు సమీపంలో కీరై పట్టి అనే ఒక గ్రామం ఉంది.. ఈ గ్రామంలో అమ్మూబీ, రసూల్ దంపతులు జీవిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. అమ్మూబీ గృహిణిగా ఉంటుండగా.. రసూల్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఇద్దరు పిల్లలు కలిగేంతవరకు అమ్మూబీ బాగానే ఉంది. ఆ తర్వాత ఇటీవల ఆమె తన ప్రవర్తనను పూర్తిగా మార్చుకుంది. భర్తను దూరం పెట్టడం.. నిత్యం ఫోన్లో మాట్లాడడం వంటివి చేస్తోంది. అయితే ఆమెకు లోకేశ్వరన్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. భార్య ప్రవర్తన చిత్రంగా ఉండడంతో రసూల్ ఆమెతో గొడవ పడుతూ ఉండేవాడు.

లోకేశ్వరన్ స్థానికంగా సెలూన్ షాప్ నిర్వహించేవాడు. లోకేశ్వరన్ అమ్మూబీ రహస్యంగా కలుసుకున్న తీరును రసూల్ గమనించాడు. వారిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు.. ఆ తర్వాత పంచాయతీలు జరిగాయి. అనంతరం సక్రమంగా ఉంటారని అమ్ము మాట ఇచ్చింది.. అయితే మళ్లీ ఆమె దారితప్పింది.. ఈసారి ఆమె ప్రియుడు , ఆమె కలిసి ఒక ప్రణాళిక రూపొందించారు.. రసూల్ ను లేపేయాలని అనుకున్నారు. ఇందులో భాగంగా వారి ప్రణాళికను అమలులో పెట్టారు.

Also Read: Mithun Reddy Arrested: మిథున్ రెడ్డి అరెస్ట్.. అంతా సైలెన్స్!

ముందుగా రసూల్ కు అమ్మూబీ పండ్ల రసం ఇచ్చింది. అందులో విషం కలిపింది. దానిని తాగడానికి రసూల్ నిరాకరించాడు. ఆ తర్వాత సాంబార్ లో పురుగుల మందు కలిపి అతడికి ఇచ్చింది. అన్నంలో కలుపుకొని తిన్న అతడు ఒకసారిగా అస్వస్థతకు గురయ్యాడు. ఆ తర్వాత చనిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడి మృతిపై అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు మృతుడి భార్యపై నిఘా పెట్టారు.

పోలీసుల పరిశీలనలో రసూల్ ను అతని భార్య చంపినట్టు తెలింది. అతని భార్య వాట్సాప్ వాయిస్ మెసేజ్ లలో రసూల్ తో మాట్లాడిన మాటలకు సంబంధించిన ఆధారాలు పోలీసులకు లభించాయి..”నువ్వు నాకు ఇచ్చిన క్రిమిసంహారకమందును ముందుగా దానిమ్మ రసంలో కలిపాను.. అతడు దానిని తాగలేదు. దీంతో సాంబార్లో క్రిమిసంహారక మందును కలిపాను. అతడు తాగి చచ్చిపోయాడు” అని అమ్మూబీ వాయిస్ మెసేజ్ ఆమె ప్రియుడికి పంపించింది. ఆ వాయిస్ మెసేజ్ పోలీసులకు లభ్యన్ కావడంతో పోలీసులకు బలమైన ఆధారం లభించింది. దీని ప్రకారం లోకేశ్వరన్, అమ్ము ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version