Homeక్రైమ్‌Ketan Agarwal case update: పూణే బిజినెస్ మెన్ కేసు.. ఆ ముసుగు వ్యక్తి ఎవరు..

Ketan Agarwal case update: పూణే బిజినెస్ మెన్ కేసు.. ఆ ముసుగు వ్యక్తి ఎవరు..

Ketan Agarwal case update: మహారాష్ట్రలో ప్రస్తుత 33 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. నాలుగు రోజుల క్రితం కూడా అదే స్థాయిలో ఉష్ణోగ్రత ఉంది. అంతటి ఉష్ణోగ్రతలో.. అది కూడా ఉక్క పోత అధికంగా ఉన్న సమయంలో.. ఓ వ్యక్తి హుడి ధరించాడు. అంతేకాదు అత్యంత అనుమానాస్పదంగా కనిపించాడు. అదే ఇప్పుడు పూనే వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ కీలకంగా మారింది.

కేతన్ అగర్వాల్ హత్య కేసులో సీసీటీవీ ఫుటేజ్ అత్యంత కీలకంగా మారింది. కేతన్.. అతడికి కాబోయే భార్య సియాగోయల్ ప్రయాణించిన దారిలో ఒక వ్యక్తి హుడి ధరించి కనిపించాడు. వారిని అనుసరించాడు. అయితే అతడు మరెవరో కాదని.. సియా ప్రియుడు చేతన్ అని పోలీసులు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చారు.

లోహ్ గడ్ ప్రాంతంలో ఉష్ణోగ్రత అధికంగా ఉన్నప్పటికీ ఆ వ్యక్తి హుడి ధరించడం పోలీసులకు అనుమానం కలిగించింది సియా.. కేతన్ వెళ్లిన మార్గంలోనే అతడు కనిపించాడు. అంతేకాదు, సియా వెనక్కి తిరిగి చూడగా ఆ హుడీ ధరించిన వ్యక్తి కింద కూర్చుని పోయాడు. సియా మళ్లీ ముందుకు చూడగానే అతడు నిలబడ్డాడు. ఈ నేపథ్యంలో అసలు సియా.. కేతన్ ఎందుకు ట్రెక్కింగ్ కు వచ్చారో.. పోలీసులు దర్యాప్తు చేస్తే.. సంచలన విషయాలు వెలుగు చూశాయి. కేతన్ ను అంతం చేయడానికే సియా అక్కడికి తీసుకెళ్లిందని తెలుస్తోంది.

ఆ కోట వద్దకు తీసుకుపోవాలని సియా అనేక పర్యాయాలు కేతన్ ను అడిగింది. కాబోయే భార్య మాట కాదనలేక కేతన్ సియాను తీసుకొని మే 31న అక్కడికి వెళ్ళాడు. జూన్ నాలుగున కూడా తీసుకెళ్లాలని సియా అడిగితే కేతన్ తల్లి ఒప్పుకోలేదు. అదే కాదు ప్రీ వెడ్డింగ్ షూట్ లో భాగంగా ఇండోనేషియాలోని బాలీ ప్రాంతానికి వెళ్దామని సియా అడిగింది. అయితే అప్పుడు కేతన్ పాస్ పోర్టు కనిపించకపోవడంతో ఆ ప్రయాణం కాస్త రద్దయింది.. బాలి ప్రాంతంలో అతడిని చంపేయాలని సియా ప్రణాళిక రూపొందించింది.

అంతకుముందు తోసేసింది

కేతన్ అగర్వాల్ ను జూన్ 14న లోహ్ గడ్ కోటకు తీసుకెళ్లిన సియా.. అతడిని తోసివేసింది. అయితే ఒక పొదను పట్టుకొని అతడు బతికిపోయాడు. అయితే ఆ సమయంలో తనకు ఒక పాము కనిపించిందని.. అందువల్లే తోసి వేశానని ఆమె చెప్పింది. ఆమె చెప్పిన మాటలను కేతన్ నమ్మాడు. జూన్ 14న బతికినప్పటికీ.. జూన్ 18న మళ్లీ అదే ప్రాంతంలో ప్రాణాలు కోల్పోయాడు. ఎత్తైన ప్రదేశాలను చూస్తే కేతన్ భయపడేవాడు. దానిని గుర్తించిన సియా అతడిని ఆ ప్రాంతం వద్దకు తీసుకెళ్లింది. గాలి తీవ్రతకు తట్టుకోలేక అతడు అందులో పడిపోయాడని కట్టుకథలు చెప్పింది.

మరోవైపు చేతన్, సియా దాదాపు 238 గంటలసేపు ఫోన్లో మాట్లాడుకున్నారు. వారిద్దరి మధ్య 2004 కాల్స్ కొనసాగాయి. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య బలమైన బంధం కొనసాగుతూ ఉందని పోలీసులు నిర్ణయించుకున్నారు. ప్రణాళిక ప్రకారమే వారిద్దరూ అతన్ని చంపేసినట్టు పోలీసులు అంచనాకు వచ్చారు. అంతేకాదు చేతన్ సోషల్ మీడియాలో ఫోటోలను చూసి.. అతడు ధరించిన హుడిని పరిశీలించారు. అతడే అని నిర్ధారణకు వచ్చారు. దీనికి తోడు అతడు పోర్టు ప్రాంతానికి తన ఫోన్ తీసుకురాలేదు. ఇంటర్నెట్ కూడా ఆపేశాడు. దీంతో పోలీసులు అనుమానించింది నిజమైంది.. జూన్ 18న కేతన్, సియా కోట వద్దకు రాగానే.. చేతన్ అలర్ట్ అయ్యాడు. తన ప్రియురాలు చెప్పినట్టుగా చేశాడు. ఆ తర్వాత సియా, చేతన్ కలిసి కేతన్ ను లోయలోకి తీసివేశారు. దానిని ప్రమాదంగా నమ్మించే ప్రయత్నం చేశారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version