Corona In India: దేశంలో కరోనా కల్లోలం: ఒక్కరోజులో 2.59 లక్షల కేసులు.. 358 మరణాలు

Corona In India: దేశంలో కరోనా మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. మొన్నటివరకు తగ్గుముఖం పట్టిన కొవిడ్ -19 ప్రస్తుతం వేగంగా వ్యాప్తి చెందుతోంది. దేశంలో థర్డ్ వేవ్ మొదలైందని ఇటీవల ఏయిమ్స్ వైద్యులు ప్రకటించిన విషయం తెలిసిందే. కేంద్రం ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఒకే చోట 10 కేసులను గుర్తిస్తే దానికి కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించాలని తెలిపింది.దేశ ప్రజలంతా కొవిడ్ నిబంధనలను విధిగా పాటించాలని లేనియెడల జరిమానా విధిస్తామని పలు రాష్ట్ర […]

Written By: Neelambaram, Updated On : January 17, 2022 12:16 pm
Follow us on

Corona In India: దేశంలో కరోనా మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. మొన్నటివరకు తగ్గుముఖం పట్టిన కొవిడ్ -19 ప్రస్తుతం వేగంగా వ్యాప్తి చెందుతోంది. దేశంలో థర్డ్ వేవ్ మొదలైందని ఇటీవల ఏయిమ్స్ వైద్యులు ప్రకటించిన విషయం తెలిసిందే. కేంద్రం ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఒకే చోట 10 కేసులను గుర్తిస్తే దానికి కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించాలని తెలిపింది.దేశ ప్రజలంతా కొవిడ్ నిబంధనలను విధిగా పాటించాలని లేనియెడల జరిమానా విధిస్తామని పలు రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరించాయి. ఇప్పటికే వీటిని హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి మెట్రో సిటీల్లో అమలు చేస్తున్నారు. రూ.వెయ్యికి పైగా ఫైన్‌లు విధిస్తున్నా జనాల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు.

Corona In India

తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌ షాక్ ఇచ్చింది. కేవలం 24 గంటల్లోనే 16.28 శాతం నుంచి 19.65 శాతానికి కొవిడ్ పాజిటివిటి రేటు పెరిగింది. ఆదివారం 13.13లక్షల శాంపిళ్లను పరీక్షించగా, కొత్తగా 2, 58,089మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ జరిగింది. వీటిని కలుపుకుని దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.73కోట్లకు చేరింది. కరోనా సెకండ్ వేవ్ కన్నా మూడో దశలోనూ దేశంలో మరణాలు భారీగా నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే కొవిడ్ వలన 358 మంది ప్రాణాలు కోల్పోయారు.

Also Read: తెలుగు రాష్ట్రాల్లో కరోనా కల్లోలం.. పరిస్థితి ఎలా ఉందంటే?

తాజాగా మరణాలు కలుపుకుని మొత్తం మరణాల సంఖ్య 4, 86, 451కి చేరింది. దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య కూడా 6.02 శాతం పెరుగుదలతో మొత్తం 8,209ల కేసులు దేశంలో వెలుగుచూశాయి. కొత్త కేసుల నమోదుతో పాటు రికవరీ రేటు కూడా పెరుగుతుండటం సానుకూల అంశం. నిన్న ఒక్కరోజే 1.51లక్షల మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. రికవరీల సంఖ్య 3.53 కోట్లకు పెరిగింది. రికవరీ రేటు 94.27 శాతంగా నమోదైంది.

దేశంలో ప్రస్తుతం 16,56,341 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మొత్తం కేసుల్లో ఇవి 4.43 శాతమని ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో కొవిడ్ టీకా పంపిణీ ప్రక్రియ ప్రారంభమై ఏడాది పూర్తవుతుండగా నేటివరకు 157.20 కోట్ల టీకాలను పంపిణీ చేసినట్టు ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశంలో ఇంకా 13.79 కోట్ల డోసులు అందుబాటులో ఉన్నట్టు కేంద్రం ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Also Read: కరోనా పాజిటివ్ వచ్చిందా.. త్వరగా కోలుకోవాలంటే తీసుకోవాల్సిన ఆహారాలివే?

Tags