Samantha: అమ్మ చెప్పిందంటూ మరోసారి ఎమోషనల్ పోస్ట్ చేసిన.. సమంత!

samantha: గత కొన్ని నెలల నుంచి సోషల్ మీడియాలో సమంతా పేరు ట్రెండ్ అవుతుంది. సమంత విడాకుల విషయం గురించి ప్రతి రోజు ఏదో ఒక వార్త ద్వారా సోషల్ మీడియాలో అవుతున్నారు. ఈ క్రమంలోనే అక్టోబర్ 2వ తేదీ విడాకుల విషయాన్ని ప్రకటించిన తర్వాత సమంత గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే సమంత తన గురించి వస్తున్నటువంటి ఇలాంటి వార్తల పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆ వార్తలను […]

Written By: Navya, Updated On : October 25, 2021 1:16 pm
Follow us on

samantha: గత కొన్ని నెలల నుంచి సోషల్ మీడియాలో సమంతా పేరు ట్రెండ్ అవుతుంది. సమంత విడాకుల విషయం గురించి ప్రతి రోజు ఏదో ఒక వార్త ద్వారా సోషల్ మీడియాలో అవుతున్నారు. ఈ క్రమంలోనే అక్టోబర్ 2వ తేదీ విడాకుల విషయాన్ని ప్రకటించిన తర్వాత సమంత గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే సమంత తన గురించి వస్తున్నటువంటి ఇలాంటి వార్తల పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆ వార్తలను ఖండించింది. ఇకపోతే విడాకులు తీసుకున్న తర్వాత సమంత సోషల్ మీడియా వేదికగా మై మామ్ సెడ్ అనే ట్యాగ్ జోడించి ఎన్నోపోస్ట్లు చేశారు.


తాజాగా సమంత మరొక పోస్టును అమ్మ చెప్పింది అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా సమంత స్పందిస్తూ ఇప్పుడు ఈ సమయంలో మీరు ఇలా ఉన్నందుకు ఎంతో కృతజ్ఞతగా ఉండండి.. అలాగే రేపు మీకు ఏం కావాలని కోరుకుంటున్నారు దాని కోసం ప్రయత్నం చేయండి అంటూ సమంత తెలియజేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇకపోతే సమంత ప్రస్తుతం తన స్నేహితురాలతో కలిసి వివిధ తీర్థయాత్రలను చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక విడాకుల తర్వాత సమంతా ఒంటరిగా తన జీవితాన్ని గడపుతూ మరోసారి సినిమాలపై తన దృష్టిని సారించింది. ఈ క్రమంలోనే దసరా కానుకగా సమంత రెండు సినిమాలను అధికారికంగా ప్రకటించింది. ఇక తెలుగులో సమంత నటించిన పౌరాణిక చిత్రం శాకుంతలం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుందని త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది.