మహేష్ ఈ నెల 15వ తేదీ నుండి.. !

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో రానున్న ‘సర్కారు వారి పాట’ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ డేట్ ఫిక్స్ అయింది. హైదరాబాద్ లోని ఈ నెల 15వ తేదీన మొదలు కానున్న ఈ షెడ్యూల్ 25 రోజులు పాటు జరగనుంది. కాగా ఈ షెడ్యూల్ షూట్ లో మహేష్ తో పాటు కీర్తి సురేష్, వెన్నల కిషోర్ కూడా పాల్గొనబోతున్నారు. మొదటి వారం రెండు కామెడీ సీన్స్ తీస్తారట. ఆ తరువాత నుండి […]

Written By: admin, Updated On : April 4, 2021 11:27 am
Follow us on


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో రానున్న ‘సర్కారు వారి పాట’ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ డేట్ ఫిక్స్ అయింది. హైదరాబాద్ లోని ఈ నెల 15వ తేదీన మొదలు కానున్న ఈ షెడ్యూల్ 25 రోజులు పాటు జరగనుంది. కాగా ఈ షెడ్యూల్ షూట్ లో మహేష్ తో పాటు కీర్తి సురేష్, వెన్నల కిషోర్ కూడా పాల్గొనబోతున్నారు. మొదటి వారం రెండు కామెడీ సీన్స్ తీస్తారట. ఆ తరువాత నుండి ఓ స్పెషల్ సాంగ్ ను షూట్ చేయడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. ఈ సాంగ్ ను శేఖర్ మాస్టర్ కంపోజ్ చేయనున్నాడు.

ఇక ఈ సినిమా కాన్సెప్ట్ కూడా భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూనే సాగుతోందనే విషయం తెలిసిందే. అయితే మహేష్ ఈ సినిమాలో కొత్త లుక్ లో కనిపించబోతున్నాడు. అప్పుడెప్పుడో ‘పోకిరి’ సినిమాలో డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్న మహేష్, మళ్ళీ ఆ సినిమా తరువాత ఇప్పుడే అలాంటి లుక్ లో కనిపించబోతున్నాడు. ‘సర్కారు వారి పాట’ సినిమాలో రింగుల జుట్టుతో కాలేజీకి వెళ్లే స్టూడెంట్ బాడీ లాంగ్వేజ్ తో మహేష్ కనిపిస్తే.. ఇక బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడం గ్యారంటీ.

అన్నట్టు మే నుండి తరువాత షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారు. ఆ షెడ్యూల్ లో బ్యాంక్ సీన్స్ షూట్ చేయనున్నారు. అందుకే ఈ నెల నుండి బ్యాంక్ సెట్ వర్క్ స్టార్ట్ కానుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఆర్ట్ డైరెక్టర్ తోట తరుణి ఆధ్వర్యంలో ప్రత్యేకమైన సెంట్రల్ బ్యాంక్ కి సంబంధించిన భారీ సెట్ ను నిర్మించనున్నారు. ఈ సెట్ లోనే బ్యాంకు నేప‌థ్యంలో సాగే కీల‌క‌మైన ఎపిసోడ్ తీయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ మూవీని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి.