Anchor Rashmi: యాంకర్ రష్మికి చిత్తూరులో చేదు అనుభవం.. ఒక్కసారిగా మీదకు దూసుకువచ్చిన అభిమానులు!

Anchor Rashmi: తెలుగు బుల్లితెరపై యాంకర్ రష్మి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రష్మి బుల్లితెరపై ప్రసారమయ్యే వివిధ కార్యక్రమాలలో పాల్గొంటూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక రష్మీ సుధీర్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ జంటకు సోషల్ మీడియాలో యమ క్రేజ్ ఉంది. వీరిద్దరూ కలిసి వేదికపై చేసే రొమాంటిక్ సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం రష్మీ వివిధ కార్యక్రమాలకు […]

Written By: Navya, Updated On : October 28, 2021 9:21 pm
Follow us on

Anchor Rashmi: తెలుగు బుల్లితెరపై యాంకర్ రష్మి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రష్మి బుల్లితెరపై ప్రసారమయ్యే వివిధ కార్యక్రమాలలో పాల్గొంటూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక రష్మీ సుధీర్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ జంటకు సోషల్ మీడియాలో యమ క్రేజ్ ఉంది. వీరిద్దరూ కలిసి వేదికపై చేసే రొమాంటిక్ సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి.

ప్రస్తుతం రష్మీ వివిధ కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ పలు షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొంటూ అభిమానులను సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే రష్మి చిత్తూరులోని స్థానిక చర్చి వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అతిథిగా వెళ్లారు. అయితే షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రష్మీ వస్తుందని తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు.

ఈ క్రమంలోనే రష్మీ అక్కడికి చేరుకోవడంతో అభిమానులు పెద్ద ఎత్తున కేకలు వేస్తూ తనతో సెల్ఫీలు దిగడానికి పోటీపడ్డారు. కొందరు ఆకతాయిలు పెద్దగా అరుస్తూ, కేకలు వేస్తూ ఒక్కసారిగా ఆమె పైకి దూసుకు రావడంతో రష్మీ ఎంతో ఇబ్బంది పడింది. ఇలా అభిమానులను కంట్రోల్ చేయడానికి మాల్ సిబ్బంది విఫలమయ్యారు. అభిమానులందరూ అలా దూసుకురావడంతో ఏమాత్రం సహనం కోల్పోకుండా చిరునవ్వుతో వారికి సర్దిచెప్పి మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.