
బాలీవుడ్, టాలీవుడ్ నటి పూజా హెగ్డే ’రాధేశ్యామ్‘ సినిమాలో ప్రభాస్ సరసన నటిస్తోంది. అయితే ఈ సినిమాలో డ్యూయల్ రోల్లో నటిస్తోందని సోషల్ మీడియాలో పలు వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలు అవాస్తవమని ఈ అమ్మడు తాజాగా తెలిపింది. ఇటీవల ఇటలీలో ’రాధేశ్యామ్‘ షూటింగ్ లో పాల్గొన్ననాని, తొలి రెండు రోజులు ఇబ్బందులు పడ్డామన్నారు. ఆ తరువాత అలవాటైందని పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్లో పాల్గొంటున్నుమాని పూజల తెలిపారు. కాగా ఇటీవల ఈ సినిమాలో ఆమె పాత్ర పేరైన ‘ప్రేరణ’ పేరుతో లుక్ రిలీజైంది. ఈ లుక్ కు నెటిజన్ల నుంచి ప్రశంసలు వచ్చాయని ఆమె తెలిపింది.