వారి కుటుంబాలను ఆదుకోవాలి: పవన్ కల్యాణ్

జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదుల కాల్పులకు బలైన ర్యాడా మహేశ్ కు ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. సోమవారం కేటీఆర్, మహేశ్ కుటుంబానికి అన్ని విధాలుగా సహకారం ఉంటామని తెలిపారు. మంత్రి నిరంజన్ రెడ్డి కంటతడి పెట్టుకున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం మహేశ్ కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి, ర్యాడ మహేశ్ ల ఆత్మకు శాంతి చేకూర్చాలన్నారు. ఉగ్రవాదులతో పోరాటం చేసిన వీర సైనికులను ఎప్పటికీ […]

Written By: Suresh, Updated On : November 9, 2020 4:00 pm
Follow us on

జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదుల కాల్పులకు బలైన ర్యాడా మహేశ్ కు ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. సోమవారం కేటీఆర్, మహేశ్ కుటుంబానికి అన్ని విధాలుగా సహకారం ఉంటామని తెలిపారు. మంత్రి నిరంజన్ రెడ్డి కంటతడి పెట్టుకున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం మహేశ్ కు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి, ర్యాడ మహేశ్ ల ఆత్మకు శాంతి చేకూర్చాలన్నారు. ఉగ్రవాదులతో పోరాటం చేసిన వీర సైనికులను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటానని అన్నారు. వారి కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలను పవన్ కల్యాణ్ కోరారు.