ఇటీవల కరోనా వ్యాధి బారిన బడి కోలుకున్న సినీ నటి తమన్నా పలు ఆసక్తి విషయాలను బయటపెట్టారు. కరోనా వ్యాధి నివారణకు తీసుకుంటున్న చికిత్స సమయంలో తాను ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నానో వెల్లడించింది. ‘కరోనా సోకినప్పడు నాకు అండగా ఉన్నవారికి పేరుపేరున ధన్యవాధాలు.. నా తల్లిదండ్రలు నాకెంతో సేవ చేశారు. ఒకనొక దశలో నేను బతుకుతానో లేదోనని భయపడ్డాను. కానీ వైద్యులు ఇచ్చిన సరైన చికిత్సతో కోలుకోవడం అదృష్టంగా భావిస్తున్నా.. అయితే ఇదే సమయంలో కొందరు నా లోపాలను ఎత్తి చూపారు. నేను లావయ్యాయయని కామెంట్స్ చేశారు. ఒకరు బాధలో ఉంటే వారి బాగోగుల కంటే లోపాలను ఎత్తిచూపడమే అలవాటు అనుకుంటా.. దీంతో వారి మనస్థత్వం అర్థమైంది’ అంటూ తమన్నా వెల్లడించారు.