spot_img
Homeబిజినెస్Xiaomi Redmi Note 15: తక్కువ ధరలో ప్రీమియం ఫోన్ ఇది.. ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో...

Xiaomi Redmi Note 15: తక్కువ ధరలో ప్రీమియం ఫోన్ ఇది.. ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో తెలుసా?

Xiaomi Redmi Note 15: స్మార్ట్ ఫోన్ లు విస్తృతంగా మార్కెట్ ను ముంచెత్తుతున్న నేటి కాలంలో.. చాలామంది తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఉన్న వాటిని కోరుకుంటారు. అది భారతీయుల లక్షణం కూడా. నేటి పోటీ కాలంలో ఫోన్ లో ఎక్కువ ఫీచర్లను అన్ని కంపెనీలు అందిస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే ధర కూడా ప్రకటిస్తున్నాయి. అయితే కొంతమంది వినియోగదారులు ఎక్కువ ఫీచర్లను కోరుకుంటారు, ధర తక్కువగా ఉండాలని భావిస్తారు. అటువంటి వారికి xiaomi Redmi note 15 మంచి ఎంపిక.

2026 సంవత్సరాన్ని ఘనంగా ప్రారంభించడానికి xiaomi బలమైన ప్రణాళికలు రూపొందించుకుంది. ఇందులో భాగంగానే Red me note 15 ను తెరపైకి తీసుకొచ్చింది.. ఇందులో అద్భుతమైన ఫీచర్లను యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ యూజర్లను దృష్టిలో పెట్టుకొని ఈ ఫోన్ రూపొందించినట్టు xiaomi company చెబుతోంది.

ఫీచర్లు ఏంటంటే

Xiaomi Note 15 సిరీస్ లో Snapdragon 6 Gen 3 చిప్ సెట్ ఆధారంగా నడుస్తుంది. 120 Hz రీ ఫ్రెష్ రేట్, 3,200 నిట్ ల గరిష్టమైన brightness, 6.67 అంగుళాల curved AMOLED డిస్ ప్లే ను కలిగి ఉంటుంది. దీనికి TUV సర్టిఫైడ్ ఐ కేర్, వెట్ టచ్ సపోర్టు లభిస్తుంది. కెమెరా సెట్ అప్ లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ప్రధాన ఆకర్షణ. తక్కువ కాంతిలో కూడా 3x ఇన్ సెన్సార్ జూమ్ తో ఫోటోలు తీయవచ్చు. 108 mp Samsung ISOCELL hm 9 సెన్సార్ ఆధారంగా ఈ ఫోన్ పని చేస్తూ ఉంటుంది.

5,520 ఎం ఏ హెచ్ సిలికాన్ కార్బన్ బ్యాటరీ, 45 వాట్స్ వైర్డ్ చార్జింగ్ ఈ ఫోన్లో ఉన్న ప్రధాన ప్రత్యేకత. ఈ ఫోన్ కు నాలుగు సంవత్సరాల ఓ ఎస్ అప్ గ్రేడ్, ఆరు సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచ్ లభిస్తుందని xiaomi చెబుతోంది. సాఫ్ట్వేర్ అప్డేట్స్ 20 30 వరకు, సెక్యూరిటీ ప్యాచ్ 2032 వరకు లభిస్తాయని తెలుస్తోంది. ఈ ఫోన్ డిజైన్ కూడా అద్భుతంగా ఉంది. బడ్జెట్ రేంజిలో ప్రీమియం స్థాయిలో కనిపిస్తోంది. 2026 లో ఈ సిరీస్ ఫోన్లు ఎక్కువగా అమ్ముడుపోతాయని xiaomi కంపెనీ చెబుతోంది.

Xiaomi కంపెనీ తయారుచేసిన ఉత్పత్తుల్లో రెడ్ మీ సిరీస్ అత్యుత్తమమైనది. అయితే ఈ సిరీస్లో ఈ కాలంలో వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేపట్టింది కంపెనీ. పైగా దీని ధరను బిల్ మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్ ప్రజలు కొనుగోలు చేసే విధంగా నిర్ణయించింది. అన్ని ఈ కామర్స్ వెబ్సైట్లు, ఆఫ్లైన్ స్టోర్లలో ఈ సిరీస్ ఫోన్ లను షావోమి కంపెనీ అందుబాటులో ఉంచింది.. ధర 15 నుంచి 20 వేల మధ్యలో ఉంటుందని కంపెనీ చెప్పింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Narendra Modi : వెన్నుచూపని మోడీ తగ్గాడా.. కాక్రోచ్ ల చేతిలో ఓడిపోయాడా

Narendra Modi : అవి అసాంఘిక శక్తులని తెలుసు. అవి చేస్తున్న ఉద్యమం సో కాల్డ్ అని కూడా తెలుసు. దానిని ఎలా వంచాలో కూడా తెలుసు. అయినప్పటికీ నరేంద్ర మోడీ బయపడ్డారు....

Dharmendra Pradhan : ఇది విద్యార్థుల విజయం ప్రజాస్వామ్య విజయం

Dharmendra Pradhan : ప్రజాస్వామ్యంలో ప్రజల స్వరం, ముఖ్యంగా యువత గొంతు, పాలకులను నిర్ణయాలు మార్చుకునేలా చేయగలదని మరోసారి రుజువైంది. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణపై వ్యక్తమైన అసంతృప్తి, వరుసగా ప్రశ్నాపత్రాల లీకేజీ...
OnePlus N6x

OnePlus N6x: ఒక్కసారి చార్జింగ్ చేస్తే 2.5 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ధర రూ.20 వేల లోపే..

OnePlus N6x: ప్రస్తుత కాలంలో మొబైల్ వాడకం పెరిగిపోయింది.దీంతో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. వీరికి అనుగుణంగా కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటి...
POCO M8 Power

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...
Honda CB500

Honda CB500: రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఇది..

Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల...
Oktelugu Epaper